Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గౌరవ హౌదాలో పనిపై గంగూలీ
ముంబయి : బీసీసీఐ నూతన రాజ్యాంగంలోని నిబంధన 38 ప్రకారం ఏ మాజీ క్రికెటర్ సైతం బీసీసీఐలో గౌరవ హౌదాలో పని చేసేందుకు సిద్ధంగా లేరని బోర్డు అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నారు. ఆదివారం సర్వ సభ్య సమావేశం అనంతరం గంగూలీ విరుద్ధ ప్రయోజనాల అంశంపై విపులంగా మాట్లాడాడు. ' నేను గతంలోనే చెప్పాను. విరుద్ధ ప్రయోజనం నిబంధన మతి లేని రూల్. దీన్ని కచ్చితంగా తొలగించాలి. ఓ సెలక్టర్ అల్లుడు, కొడుకు జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు అది విరుద్ధ ప్రయోజనం. అదే సెలక్టర్కు చెందిన స్నేహితుడు కుమారుడి జాతీయ జట్టుకు ఆడినప్పుడు విరుద్ధ ప్రయోజనం లేదు. నిజానికి సొంత బంధువుల కంటే స్నేహితుల కుటుంబంతోనే ఎక్కువ సాన్నిహిత్యం ఉన్న సందర్భంలో విరుద్ధ ప్రయోజనం రూల్ ఏం చెబుతుంది? విరుద్ధ ప్రయోజనం ఉండదని చెప్పగలరా?' అని గంగూలీ ప్రశ్నించాడు. క్రికెట్ సలహా సంఘం (సీఏసీ)పై కొన్ని రోజులు ఆగాల్సిందే. హడావుడిగా నియామకంతో మళ్లీ విరుద్ధ ప్రయోజనాలు అంటూ తప్పుకునే పరిస్థితిని కోరుకోవటం లేదు. సీఏసీ సభ్యులకు వేతనాలు ఇచ్చే ఆలోచన సైతం సరైనది కాదు. సెలక్షన్ కమిటీ, చీఫ్ కోచ్ ఎంపిక మాత్రమే సీసీఏ పని. సెలక్షన్ కమిటీ నాలుగేండ్లు, చీఫ్ కోచ్ మూడేండ్లు కొనసాగుతాడు. వేతనాలు ఇచ్చే పరిస్థితిలో ఏం పని చేస్తారనే సీఏసీకి ఇవ్వగలం? అని గంగూలీ అన్నాడు. బోర్డు అంబుడ్స్మన్, ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ డికె జైన్తో గంగూలీ సోమవారం భేటీ అయ్యారు. విరుద్ధ ప్రయోజనాల అంశంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయం భేటిలో ప్రధానంగా చర్చించారు.