Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, హైదరాబాద్ : యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు కెప్టెన్ విరాట్ కోహ్లి నుంచి మద్దతు లభించింది. ఇటీవల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం పంత్కు బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్తో న్యూఢిల్లీ టీ20లో రిషబ్ పంత్ సమీక్ష కోరగా నిర్ణయం వ్యతిరేకంగా వచ్చింది. అభిమానులు వెంటనే ' ధోని ధోని ధోని' అంటూ నినాదాలు చేశారు. దీనిపై కోహ్లి స్పందించాడు. ' రిషబ్ పంత్ సామ ర్థ్యంపై జట్టుకు నమ్మకం ఉంది. కఠోరంగా సాధన చేయటం, రాణించటం ఆటగాడి బాధ్యత అనే వరకూ అంగీకరిస్తాను. కానీ ఓ ఆటగాడు మెరుగ్గా రాణించేం దుకు అవసరమైన సహకారం అందించటం అందరి బాధ్యత. ఒకవేళ పంత్ ఓ అవకాశం చేజార్చితే అభిమా నులు ధోని ధోని అంటూ అరవాల్సిన పని లేదు. అది మర్యాద కాదు. ఎవరూ అటువంటి పరిస్థితుల్లో ఉండాలని కోరుకోరు. స్వదేశంలో ఆడుతున్నప్పుడు అభిమానుల నుంచి అపూర్వ మద్దతు లభించాలి. ఇలా అమర్యాదగా ప్రవర్తించకూడదు' అని విరాట్ అన్నాడు.