Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీకాంత్, కశ్యప్, ప్రణీత్ ఓటమి
- మలేషియా మాస్టర్స్ టోర్నీ
కౌలాలంపూర్ (మలేషియా) : 2020 సీజన్ను స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పి.వి సింధులు అలవోక విజయాలతో ఆరంభించారు. మలేషియా మాస్టర్స్ మహిళల సింగిల్స్లో సైనా, సింధు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, బి. సాయిప్రణీత్లు పరాజయంతో ఏడాదిని మొదలెట్టారు. వరల్డ్ చాంపియన్ సింధు తొలి రౌండ్లో 21-15, 21-13తో రష్యా షట్లర్ ఎవిగెనియాపై విజయం సాధించింది. వరుస గేముల్లో గెలుపొందిన సింధు 35 నిమిషాల్లోనే రష్యా అమ్మాయిని పడగొట్టింది. అన్సీడెడ్ సైనా నెహ్వాల్ మరో మ్యాచ్లో 21-15, 21-17తో బెల్జియం క్రీడాకారిణి లియానె టాన్పై వరుస గేముల్లో విజయం సాధించింది. మెన్స్ సింగిల్స్లో హెచ్.ఎస్ ప్రణరు 21-9, 21-17తో జపాన్ షట్లర్ కంటాపై గెలుపొందాడు.
పురుషుల సింగిల్స్లో మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ 17-21, 5-21తో చైనీస్ తైపీ షట్లర్ చో తీన్ చెన్ చేతిలో వరుస గేముల్లో పరాజయం పాలయ్యాడు. వరల్డ్ నం.1, టాప్ సీడ్ కెంటో మోమోట (జపాన్) 21-17, 21-16తో సీనియర్ షట్లర్ పారుపల్లి కశ్యప్పై గెలుపాందాడు. అగ్ర షట్లర్కు రెండు గేముల్లోనూ గట్టి పోటీనిచ్చిన కశ్యప్ ఆఖరు వరకూ పోరాడాడు. బి. సాయిప్రణీత్ 11-21, 15-21తో రాస్మస్ గెమ్కె (డెన్మార్క్) చేతిలో కంగుతిన్నాడు.