Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినేశ్ ఫోగట్పై సాక్షి మాలిక్
న్యూఢిల్లీ : రియో ఒలింపిక్స్లో భారత్ మెడల్స్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో తొలి పతకం అందించి రెజ్లింగ్. టోక్యో ఒలింపిక్స్లోనూ రెజ్లింగ్లో భారత్ పతకాలు ఆశిస్తోంది. దీపక్ పూనియా (86 కేజీలు), వినేశ్ ఫోగట్ (53 కేజీలు), భజరంగ్ పూనియా (65 కేజీలు), రవి దహియ (57 కేజీలు)లు టోక్యో ఒలింపిక్స్ బెర్త్లు సాధించారు. మహిళల విభాగంలో వినేశ్ ఫోగట్ మాత్రమే ఇప్పటివరకూ అర్హత సాధించింది. రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం అందుకున్న సాక్షి మాలిక్.. 2020లో పతకం రంగు మార్చుకునేందుకు సిద్ధమవుతోంది. సహచర రెజ్లర్ వినేశ్ ఫోగట్ రియోలో అనూహ్య ఓటమి చెందిందని, టోక్యోలో కచ్చితంగా పతకం సాధిస్తుందనే నమ్మకం ఉందని సాక్షి తెలిపింది. ' టోక్యో ఒలింపిక్స్ కోసం కఠోరంగా శ్రమిస్తున్నాను. ఒలింపిక్స్కు ఇంకా అర్హత టోర్నీలు ఉన్నాయి. వరల్డ్ క్వాలిఫికేషన్స్లో నేను టోక్యో అర్హత సాధించలేదు. పొరపాట్ల నుంచి నేర్చుకుని, కఠోరంగా శ్రమిస్తున్నాను. ఆసియా క్వాలిఫికేషన్ రౌండ్స్లో అర్హత సాధించి, 2020 టోక్యోలో పతకం రంగు మార్చుకుంటానని అనుకుంటున్నాను. రియోలో వినేశ్ ఫోగట్ను దురదృష్టం వెంటాడింది. 2016లో పతకం నెగ్గగలిగే స్థితిలో నిలిచినా, గాయంతో అది సాధ్యపడలేదు. కానీ 2020 టోక్యో ఒలింపిక్స్లో పతకం సాధిస్తుంది. రెజ్లింగ్లో రికార్డు మెడల్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం' అని సాక్షి మాలిక్ అన్నారు.