Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మలేషియా మాస్టర్స్ టోర్నీ
కౌలాలంపూర్ : భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి సింధు కొత్త ఏడాదిలో దూసుకుపోతున్నారు. మలేషియా మాస్టర్స్ మహిళల సింగిల్స్లో క్వార్టర్స్లో ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్లో థారులాండ్ అమ్మాయి అన్సె యంగ్పై 25-23, 21-12తో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. 34 నిమిషాల్లో ముగిసిన మరో ప్రీ క్వార్టర్స్ మ్యాచ్లో పి.వి సింధు 21-19, 21-15తో వరల్డ్ నం.19 షట్లర్ అయ ఒహరి (జపాన్)పై అలవోక విజయం నమోదు చేసింది.
యంగ్తో మ్యాచ్లో సైనా తొలి గేమ్లో గట్టి పోటీ ఎదుర్కొంది. సూపర్ టైబ్రేకర్కు వెళ్లిన తొలి గేమ్ను సైనా 25-23తో గెల్చుకుంది. కానీ రెండో గేమ్లో సైనా సత్తా చాటింది. ఇద్దరు షట్లర్ల మధ్య వ్యత్యాసం చూపించింది. పెద్దగా చెమటోడ్చకుండానే సైనా నెహ్వాల్ క్వార్టర్స్లో కాలుమోపింది. జపాన్ అమ్మాయిపై కష్టపడకుండానే సింధు గెలుపొందింది. తొలి గేమ్లో పోటీనిచ్చిన అయ రెండో గేమ్లోనూ వెంటాడింది. కానీ సింధు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ 19-21, 20-22తో పోరాడి ఓడాడు. మలేషియా ఆటగాడు లీ జీ జియ వరుస గేముల్లో సమీర్ వర్మపై గెలుపొందాడు. మరోమ్యాచ్లో హెచ్.ఎస్ ప్రణరు సైతం 14-21, 16-21తో వరల్డ్ నం.1 కెంటా మోమోట (జపాన్) చేతిలో మట్టికరిచాడు.