Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బరిలో 115 మంది క్రీడాకారులు
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా పోటీల్లో తెలంగాణ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నది. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర జట్టు సన్నద్ధమైంది. గువహటిలో 22వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో రాష్ట్రానికి చెందిన 115 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొత్తం 16 క్రీడాంశాల్లో తెలంగాణ క్రీడాకారులు ప్రాతినిథ్యం వహించనున్నారు. అండర్-17, అండర్-21 బాలబాలికల విభాగాల్లో మెగా టోర్నీ జరగనున్నది. ఈ టోర్నీలో 90 మంది వ్యక్తిగత ఈవెంట్లలో, 24 మంది టీమ్ విభాగాల్లో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర జట్టుకు చెఫ్ డి మిషన్గా రవీందర్ వ్యవహరించనున్నారు.