Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మలేషియా మాస్టర్ టోర్నమెంట్ నుంచి అవుట్
- సింధూను ఓడించిన జి యింగ్ నో
- కైరోలిన్ మారిన్ చేతిలో సైనా పరాజయం
నవతెలంగాణ క్రీడా ప్రతినిధి
ప్రపంచ ఛాంపియన్ పి వి సింధూ తర్వాత సైనా నెహ్వాల్ కూడా మలేషియా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. సైనా రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్కు చెందిన ఒలింపిక్ ఛాంపియన్ కైరోలిన్ మారిన్ వరుస సెట్లలో 8..21, 7..21 తేడాతో ఓడించింది. వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ కేవలం 30 నిమిషాల్లోనే ముగిసింది. ఈ ఓటమి తర్వాత టోర్నీలో భారత్ ఆశలు అడుగంటాయి. ఇంతకు ముందు పురుషుల టీమ్లో సమీర్ వర్మ, కిదాంబి శ్రీకాంత్, ఎచ్ఎస్ ప్రణరు, సాయి ప్రణీత్లు టోర్నీనుంచి వైదొలిగారు. ప్రపంచ ర్యాంకింగ్లో 11వ స్థానంలో ఉన్న సైనా, మరినాల మధ్య ఇప్పటివరకు 13 మ్యాచులు జరిగాయి. వీటిలో మారిన్ ఏడుసార్లు, భారత్ షట్లర్లు ఆరుసార్లు గెలిచారు. సైనా,మారిన్ల మధ్య గతేడాది జనవరిలో మ్యాచ్ జరిగిన విషయం విదితమే. రిటైర్డ్ అయ్యే సమయంలో మారిన్ విజయాన్ని నమోదు చేసుకున్నది. ప్రపంచ నెంబర్..2 స్థానంలో ఉన్న తారు జూ యింగ్, ప్రపంచ ర్యాంకింగ్లో ఆరో స్థానంలో ఉన్న సింధూ 17 సార్లు ఇద్దరి మధ్య మ్యాచ్లు జరిగాయి.వీటిలో ప్రపంచ ఛాంపియన్ అయిన సింధూ ఐదు మ్యాచ్లు గెలిస్తే...12 మ్యాచుల్లో పరాజయం పాలైంది.
ఐదు స్థానాలకు సైనా ఎగబాకి..
ఓపెనింగ్ గేమ్స్లో కైరోలిన్ కన్నా సైనా నెహ్వాల్ ఐదు స్థానాలను మెరుగుపర్చుకున్నది. ఆ సమయంలో స్కోర్లైన్ 11..6 ఉన్నది. ఆ తర్వాత మారిన్ అద్భుతమైన ఫామ్తో రాణించింది. ఆమె తిరిగి సత్తా చాటేసమయానికి భారత్ షట్లర్లు కేవలం రెండు పాయింట్లు ఇచ్చి...మొదటి గేమ్ను 21..8తో కైవసం చేసుకున్నది. ఆ తర్వాత సైనా మ్యాచ్లో ఆశించినరీతిలో సత్తా చాటుకోలేకపోయింది. తొలి గేమ్ గెలిచిన స్పెయిన్ షట్లర్ రెండో గేమ్లోనూ దూసుకుపోయింది. 21..7 పాయింట్ల తేడాతో సైనాను ఓడించి..సెమీ పైనల్లోకి దూసుకెళ్లింది.
సింధూను ఓడించి...క్వార్టర్ ఫైనల్లోకి..
తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో చైనా తైపో షట్లర్ జి యింగ్ సింధూను వరుస సెట్లలో 16..21,16..21 పాయింట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ కేవలం 36 నిమిషాల్లోనే ముగిసింది. యింగ్ చేతిలో సింధూకు వరుసగా రెండో ఓటమి కావటం గమనార్హం. ఇంతకు ముందు గతేడాది అక్టోబర్ నెలలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్లోనూ సింధూ పరాజయం పాలైన విషయం విదితమే.తాజాగా జపాన్కు చెందిన అయా అహరిని 21..10,21..15 పాయింట్ల తేడాతో ఓడించిన సింధూ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నది.