Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య న్యూజిలాండ్ పర్యటనకు దూరమయ్యాడు. వెన్ను నొప్పితో సుదీర్ఘకాలంగా క్రికెట్కు దూరమైన పాండ్య మ్యాచ్ ఫిట్నెస్ అవసరం లేకుండానే న్యూజిలాండ్-ఏ జట్టు పర్యటనకు ఎంపికయ్యాడు. జనవరి 22న న్యూజిలాండ్-ఏ జట్టుతో భారత్-ఏ జట్టు తరఫున పాండ్య బరిలోకి దిగాల్సి ఉంది. వ్యక్తిగత ట్రైనర్ రజినీకాంత్ సూచనతో న్యూజిలాండ్ పర్యటన నుంచి పాండ్య తప్పుకున్నాడు. యోయో ఫిట్నెస్ పరీక్షలో పాండ్య వైఫల్యంతోనే న్యూజిలాండ్ పర్యటనకు దూరమయ్యాడనే వార్తలు సైతం వచ్చాయి. ' ఫిట్నెస్ వైఫల్యంతో దూరం కాలేదు. యోయో పరీక్షలో పాండ్య ఇప్పటికీ 20 స్కోరు చేయగలడు. 20 మీటర్ల పరుగు సైతం రరమొదలెట్టాడు. బౌలింగ్ భారం కారణంగా పాండ్య తప్పుకున్నాడు. వరుస మ్యాచుల్లో బౌలింగ్ ఒత్తిడికి దారితీస్తుంది. పాండ్యకు ఎటువంటి ఫిట్నెస్ పరీక్ష నిర్వహించలేదు. అతడు విఫలమయ్యే ప్రసక్తే లేదు' అని ట్రైనర్ రజినీకాంత్ పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్య స్థానంలో మరో ఆల్రౌండర్ విజరు శంకర్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్నాడు. వరల్డ్కప్ తర్వాత భారత జట్టుకు దూరమైన విజరు శంకర్, ప్రస్తుతం తమిళనాడు తరఫున రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు.