Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింధు, సైనా, శ్రీకాంత్లపై ఆసక్తి
- ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీ
జకర్తా : 2019 ప్రథమార్థంలో పి.వి సింధు అపూర్వ విజయాన్ని అందించింది. ఏడాది ఆరంభంలో సైనా నెహ్వాల్ ఓ సూపర్ సిరీస్ టైటిల్ సాధించింది. ద్వితీయార్థంలో డబుల్స్ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు థారులాండ్లో విజయం సాధించింది. ఇవి మినహా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు నిలకడగా రాణించటంలో దారుణంగా విఫలమయ్యారు. 2020 టోక్యో ఒలింపిక్స్ ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో భారత బ్యాడ్మింటన్ స్టార్స్ ఫామ్ అందుకోవటంపై ఆసక్తి ఎక్కువైంది. 2020 తొలి టోర్నీ మలేషియా మాస్టర్స్లో భారత షట్లర్లు మూకుమ్మడిగా నిరాశపరిచారు. ఈ వారంలో మన షట్లర్లు మరో పరీక్షకు సిద్ధమయ్యారు. అగ్రశ్రేణి షట్లర్లు సైనా నెహ్వాల్, పి.వి సింధు, కిదాంబి శ్రీకాంత్లు ఇండోనేషియా మాస్టర్స్లో నేడు తొలి మ్యాచ్ ఆడనున్నారు.
వరల్డ్ చాంపియన్ పి.వి సింధు తొలి రౌండ్లో జపాన్ అమ్మాయిని ఎదుర్కొనుంది. అయా ఒహౌరిపై సింధుకు తిరుగులేని రికార్డుంది. జపాన్ షట్లర్పై సింధు వరుసగా 9 మ్యాచుల్లో విజయం సాధించింది. అయా కెరీర్లో సింధుపై ఇంకా గెలుపు రుచి చూడనలేదు. ఇటీవల అనామక షట్లర్ల చేతిలో కంగుతింటున్న సింధు.. నేడు అయాతో పోరులో అప్రమత్తంగా ఉండటం మంచింది!. స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు జపాన్ అమ్మాయి సయాక టకహసి సవాల్ విసురుతోంది. సయాకపై సైనా నెహ్వాల్కు మెరుగైన రికార్డు ఉంది. టోక్యో ఒలింపిక్స్లో మెడల్తో ఘనంగా వీడ్కోలు పలకాలనే ఆలోచనలో ఉన్న సైనా నెహ్వాల్ పూర్వ వైభవం కోసం కఠోరంగా శ్రమిస్తోంది. పురుషుల సింగిల్స్ మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ ఇండోనేషియా షట్లర్ను ఎదుర్కొనున్నాడు. సౌరభ్ వర్మ, సమీర్ వర్మ, హెచ్.ఎస్ ప్రణరు, బి. సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్లు నేడు ఇండోనేషియా మాస్టర్స్లో తొలి మ్యాచ్ ఆడనున్నారు.