Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ క్వార్టర్స్లో సింధు ఓటమి
- ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీ
జకర్తా : 2020లో వరుసగా రెండో టోర్నీలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పేలవ ప్రదర్శన కనబరిచారు. ఐదు విభాగాల్లో ఏ ఒక్క షట్లర్ క్వార్టర్ఫైనల్స్కు చేరుకోలేదు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్లో తెలుగు తేజం పి.వి సింధు మూడు గేముల మ్యాచ్లో ఓటమిపాలైంది. జపాన్ అమ్మాయి టకహసి చేతిలో 21-16, 16-21, 19-21తో పరాజయం చవిచూసింది. 66 నిమిషాల పాటు సాగిన ఉత్కంఠ మ్యాచ్లో తొలి గేమ్ గెల్చుకున్న సింధు తర్వాత వరుసగా రెండు గేముల్లో తడబడింది. వరల్డ్ నం.14 టకహసి రెండో రౌండ్లో మరో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ను సైతం ఓడించింది. మెన్స్ సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, బి. సాయిప్రణీత్, హెచ్.ఎస్ ప్రణరు, సమీర్ వర్మ, సౌరభ్ వర్మలు ప్రీ క్వార్టర్స్కు ముందే పరాజయం చెందారు. 2020ని మలేషియా మాస్టర్స్తో మొదలెట్టిన భారత షట్లర్లు అక్కడా నిరాశపరిచారు. ఒలింపిక్స్ ఏడాదిలో భారత స్టార్ క్రీడాకారుల పేలవ ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది.