Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాంచీ: టీమిండియా కాంట్రాక్ట్లో చోటు కోల్పోయిన రోజే ఎంఎస్ ధోని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. గురువారం రాంచీలో జార్ఖండ్ రంజీ జట్టు సభ్యులతో కలిసి అతను ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. ఒకవైపు ధోనిని కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగిస్తే, మరొకవైపు అతను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు.
బ్యాటింగ్తో పాటు రెగ్యులర్ ట్రైనింగ్లో కూడా అతను భాగమైనట్టు జార్ఖండ్ టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది. ప్రత్యేక బౌలింగ్ మెషీన్ ద్వారా అతను సాధన చేయడం విశేషం. రంజీ ఆటగాళ్లంతా ఎర్రబంతితో ప్రాక్టీస్ చేస్తే ధోని మాత్రం తెల్ల బంతితో ఆడాడు. తద్వారా ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నట్టు ధోని పరోక్షంగా తెలియజేశాడు.