Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హోబర్ట్: రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ టెన్నిస్లో అడుగిడిన సానియా తొలి టోర్నీలోనే అదరగొడుతోంది. హోబర్ట్ ఇంటర్నేషనల్ మహిళల డబుల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ పోటీలో సానియా-కిచెనోక్ జంట 7-6(7-3), 6-2 తేడాతో టమారా జిదన్సెక్ (స్లొవేకియా)-మేరీ బౌజ్కోవా(చెక్ రిపబ్లిక్) జోడీని మట్టి కరిపించింది. తుదిపోరులో చైనా ద్వయం, రెండోసీడ్ షువై పెంగ్, షువై ఝాంగ్తో తలపడనుంది. ఈ మ్యాచ్ను సానియా జంట గంటా 24 నిమిషాల్లో ముగించింది. తొలి సెట్ హోరాహోరీగా సాగడంతో ఇరువురు 6-6తో సమంగా నిలవడంతో పోరు టై బ్రేక్కు దారితీసింది.
ప్రత్యర్థులను బోల్తా కొట్టించిన సానియా-కిచెనోక్ సెట్ గెలిచి ఆధిక్యంలోకి వెళ్లారు. ఇక రెండో సెట్లో అసలు వీరికి పోటీనే ఎదురవ్వలేదు. ప్రత్యర్థి సర్వీసులను రెండు, ఆరు, ఎనిమిదో గేముల్లో బ్రేక్ చేసి సులభంగా మ్యాచ్ను ముగించారు. సానియా 2017, అక్టోబర్లో చివరిసారి చైనా ఓపెన్ ఆడింది. ప్రస్తుతం ఫిట్నెస్ పెంచుకొని పునరాగమనం చేసి రాణిస్తోంది.