Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
దుబాయ్ : ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ విజయంలో ముఖ్య భూమిక వహించిన భారత స్టార్ బ్యాట్స్మెన్ ద్వయం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాలు మరింత పదిలం చేసుకున్నారు. ఆస్ట్రేలియాపై మూడు వన్డేల్లో విరాట్ కోహ్లి 183 పరుగులు చేయగా, రోహిత్ శర్మ ఓ శతకం సహా 171 పరుగులు కొట్టాడు. ఆసీస్పై ప్రదర్శనతో విరాట్ కోహ్లి రెండు రేటింగ్ పాయింట్లు పొందగా, రోహిత్ శర్మ మూడు రేటింగ్ పాయింట్లు సొంతం చేసుకున్నాడు. ఐసీసీ వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లి 886 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 868 పాయింట్లతో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ద్వితీయ స్థానంలో నిలిచాడు. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ వరుస అర్ధ సెంచరీలతో ర్యాంకింగ్స్లో ఏడు స్థానాలు ఎగబాకాడు. వరల్డ్ నం.15 ర్యాంక్లో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ బ్యాట్స్మన్ బాబర్ ఆజామ్ 829 పాయింట్లతో నం.3 ర్యాంక్లో నిలిచాడు. బౌలర్ల జాబితాలో జశ్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ట్రెంట్ బౌల్ట్, ముజీబ్ రెహమాన్, కగిసో రబాడ, పాట్ కమిన్స్లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. జట్టు ర్యాంకింగ్స్లో వరల్డ్ చాంపియన్ ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉండగా, టీమ్ ఇండియా రెండో స్థానంలో కొనసాగుతోంది.