Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరల్డ్కప్ వేటపై రవిశాస్త్రి
న్యూఢిల్లీ : వరల్డ్కప్ సాధించటం కోహ్లిసేనకు బలీయమైన కోరిక అని భారత జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు. విరాట్ కోహ్లి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న తర్వాత భారత్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్కు చేరింది, 2019 వరల్డ్కప్ సెమీఫైనల్స్కు చేరుకుంది. కానీ రెండు సందర్భాల్లోనూ టైటిల్ విజయానికి దూరంగానే ఉండిపోయింది. 2020 టీ20 వరల్డ్కప్ కోసం జట్టు సన్నద్ధతపై రవిశాస్త్రి పలు విషయాలు వెల్లడించాడు. ' వరల్డ్కప్ విజయం ఆ జట్టు బలీయమైన కోరిక. ఇటీవల జట్టు ప్రణాళికల నుంచి టాస్ నుంచి తొలగించాం. పరిస్థితులు, ప్రాంతం, ప్రత్యర్థితో సంబంధం లేకుండా పోటీపడటం కోహ్లిసేన ధ్యేయం. ఈ జట్టుకు వరల్డ్కప్ విజయం అతిపెద్ద లక్ష్యం. ఆ కోరికను త్వరలోనే తీర్చుకుంటాం. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలతో వన్డే సిరీస్లను సైతం టీ20 వరల్డ్కప్ సన్నద్ధతకు ఉపయోగించుకుంటాం' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఐదు టీ20, మూడు వన్డేలు, రెండు టెస్టుల కోసం టీమ్ ఇండియా ఇప్పటికే న్యూజిలాండ్కు చేరుకుంది. ఆక్లాండ్లో శుక్రవారం తొలి టీ20 భారత్, కివీస్ సవాల్ ఆరంభం కానుంది. కోహ్లిసేన ఆక్లాండ్లో ఇప్పటికే తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. వన్డే జట్టులో గాయపడిన శిఖర్ ధావన్ స్థానంలో యువ పృథ్వీ షా ఎంపికైన సంగతి తెలిసిందే.