Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పి.వి సింధు ఫామ్పై గోపీచంద్
కోల్కత : రియో ఒలింపిక్స్ సిల్వర్ స్టార్ పి.వి సింధు ఫామ్పై ఆందోళన అవసరం లేదని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ' గత సీజన్లో సింధు కొంత ఇబ్బంది పడుతోంది. కానీ ప్రతిష్టాత్మక టోర్నీల్లో నిలకడగా రాణించిన రికార్డు ఆమెది. ఒలింపిక్స్ ఏడాదిలోనూ నేను అదే నమ్ముతున్నాను. మెగా ఈవెంట్లలో సింధు ఫామ్ అందుకోగలదు. మ్యాచ్ ప్రణాళికల్లో ఎక్కడెక్కడ మెరుగుపడాలో తెలుసు, వీటిని ఛేదించి త్వరలోనే దూసుకొస్తుందనే నమ్మకం ఉంది' అని గోపీచంద్ అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ సమయానికి ర్యాంకింగ్స్లో టాప్-16లో నిలిచిన ప్లేయర్స్ నేరుగా ఒలింపిక్స్కు అర్హత సాధించనున్నారు. సైనా నెహ్వాల్ 22వ, కిదాంబి శ్రీకాంత్ 26వ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఒలింపిక్స్ క్వాలిఫికేషన్కు ముందు మరో ఐదారు టోర్నీలు మాత్రమే ఉన్న నేపథ్యంలో సైనా, శ్రీకాంత్ అర్హతపై ఆందోళన నెలకొంది. కాస్త ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తున్నా, ఈ ఇద్దరూ పుంజుకోగలరని చీఫ్ కోచ్ విశ్వాసం వెలిబుచ్చారు.