Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్
- సెమీస్లో పాకిస్తాన్పై 10 వికెట్ల తేడాతో గెలుపు
పోర్చెస్ట్రోమ్(దక్షిణాఫ్రికా)
అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లోకి టీమిండియా దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ విధించిన 173 పరుగుల విజయలక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. టీమిండియా 35.2 ఓవర్లలో 176 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చిత్తుగా ఓడించింది. భారత ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (105 నాటౌట్) సెంచరీతో కదం తొక్కగా, దివ్యాన్ష్ సక్సేనా (59 నాటౌట్) అర్థ సెంచరీ చేయడంతో టీమిండియా మరో 14 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. భారత ఓపెనర్లను ఎలా కట్టడి చేయాలో అర్థంకాక పాక్ బౌలర్లు తంటాలు పడ్డారు. గురువారం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ల మధ్య జరగనున్న రెండో సెమీస్ మ్యాచ్లో గెలిచిన జట్టుతో టీమిండియా తుది పోరుకు సిద్ధమవ్వనుంది. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ పోరు ఫిబ్రవరి 9(ఆదివారం) ఇదే వేదికపై జరగనుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ యశస్వి జైస్వాల్కు దక్కింది.
పాక్ను కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు
తొలుత టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ నాజిర్ తొలిగా బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపాడు. దీంతో భారత యువ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్తో బంతులు వేస్తూ ప్రత్యర్థి జట్టును రక్షణాత్మక ధోరణిలో పడేశారు. పాక్ జట్టు 100 పరుగులకు చేరేసరికి 27 ఓవర్లు పూర్తయిపోయాయి. దీన్ని బట్టి భారత బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్థమవుతుంది. అంతకుముందు పాక్ ఓపెనర్ హైదర్ అలీ (56 పరుగులు, 9 ఫోర్ల)తో అర్థశతకం సాధించగా, మరో ఓపెనర్ మహ్మద్ హురైరా 4 పరుగుల వద్ద సుశాంత్ మిశ్రా బౌలింగ్లో సక్సేనాకు క్యాచ్ ఇచ్చి ఔటవ్వగా, వన్డౌన్లో వచ్చిన ఫవాద్ మునీర్ 16 బంతులు ఆడి పరుగులు ఒక్క పరుగు కూడా చేయకుండానే రవి బిష్ణోరు చేతికి చిక్కాడు. తర్వాత వచ్చిన ఖాసీమ్ అక్రమ్ 9 పరుగుల వద్ద మళ్లీ రవి బిష్ణోరు బౌలింగ్లో రనౌట్గా వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మహ్మద్ హారిస్తో కలిసి పాక్ కెప్టెన్ నాజిర్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. అయితే జట్టు స్కోరు 146 పరుగుల వద్ద ఉన్నప్పుడు రెండో స్పెల్కు వచ్చిన అధర్వ అంకొలేకర్ బౌలింగ్లో 21 పరుగులు చేసిన మహ్మద్ హారిస్ వెనుదిరిగాడు. భారత బౌలర్ల దాటికి పాక్ జట్టు 43.1 ఓవరల్లో 172 పరుగులకు ఆలౌటైంది. పాక్ జట్టులో ముగ్గురు బ్యాట్సమెన్ తప్ప మిగతావారెవరూ రెండెంకల స్కోరు నమోదు చేయలేకపోయారు. పాక్ బ్యాట్సమెన్లలో ఓపెనర్ హైదర్ అలీ, కెప్టెన్ రోహైల్ నాజిర్లు అర్థ శతకాలతో రాణించడంతో పాక్ జట్టు ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. వీరిద్దరు తప్ప మిగతా బ్యాట్సమెన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కాగా భారత బౌలర్లలో సుషాంత్ మిశ్రా 3 వికెట్లతో రాణించగా, రవి బిష్ణోరు, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు, అంకోల్కెర్, యశస్వి జైస్వాల్లు ఒక్కో వికెట్ తీశారు.
స్కోర్బోర్డు...
పాకిస్తాన్(అండర్-19) ఇన్నింగ్స్: హైదర్ అలీ(సి) రవి బిష్ణోరు (బి) జైస్వాల్ 56, మహ్మద్ (సి) సక్సేనా (బి) సుశాంత్ మిశ్రా 4, ఫహద్ మునీర్ (సి) అంకొలేకర్ (బి) రవి బిష్ణోరు 0, రొహైల్ నజీర్ (సి) తిలక్ వర్మ (బి) సుశాంత్ మిశ్రా 62, ఖాసిం అక్రమ్ (రనౌట్) అంకొలేకర్/ధృవ్ జురెల్ 9, మహ్మద్ హరీస్ (సి) సక్సేనా (బి) అంకొలేకర్ 21, ఇర్ఫాన్ ఖాన్ (బి) కార్తీక్ త్యాగి 3, అబ్బాస్ అఫ్రిది (ఎల్బి) రవి బిష్ణోరు 2, తాహిర్ హుసైన్ (సి) ధృవ్ జురెల్ (బి) కార్తీక్ త్యాగి 2, అమీర్ అలి (సి) సిద్ధేష్ వీర్ (బి) సుశాంత్ మిశ్రా 1, మహ్మద్ అమీర్ (నాటౌట్) 0, అదనం 12. (43.1 ఓవర్లలో ఆలౌట్) 172 పరుగులు.
వికెట్ల పతనం: 1/9, 2/34, 3/96, 4/118, 5/146, 6/156, 7/163, 8/169, 9/172, 10/172
బౌలింగ్: కార్తీక్ త్యాగి 8-0-32-2, సుశాంత్ మిశ్రా 8.1-0-28-3, రవి బిష్ణోరు 10-0-46-2, ఆకాష్ సింగ్ 7-0-25-0, అంకొలేకర్ 7-0-29-1, యశస్వి జైస్వాల్ 3-0-11-1.
భారత్(అండర్-19) ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (నాటౌట్) 105, దివ్యాన్ష్ సక్సేనా (నాటౌట్) 59, అదనం 12. (35.2 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా) 176 పరుగులు.
బౌలింగ్: తాహిర్ హుసైన్ 6-1-17-0, ఖాసిం అక్రమ్ 8-0-37-0, మహ్మద్ అమీర్ 5-1-20-0, అబ్బాస్ అఫ్రిది 7-0-50-0, అమీర్ అలి 5.2-0-38-0, ఫహర్ మునీర్ 4-0-12-0