Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో : కరొనా వైరస్ మహమ్మారీ రోజురోజుకూ విస్తరిస్తోంది. ప్రాణాంతక వైరస్ బారిన పడిన ఊపిరీ వదులుతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతుంది. వుహాన్ నుంచి ఒక్కో దేశానికి కరోనా వైరస్ అతి వేగంగా వ్యాపిస్తోంది. మరో ఆరు నెలల్లో 2020 ఒలింపిక్స్ సమీపిస్తున్న తరుణంలో టోక్యో ఒలింపిక్స్పై కరొనా వైరస్ ప్రభావం కనిపిస్తోంది. కరోనావైరస్ విజృంభణపై టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ సీఈవో ఆందోళన వ్యక్తపరిచారు. ' అతిశీతల నీరు త్రాగటం ద్వారా వ్యాప్తి చెందుతున్న కరొనా వైరస్పై టోక్యో ఒలింపిక్స్ దిశగా విస్తరిస్తుందేమోనని మేము తీవ్రంగా కలత చెందుతున్నాం. కరొనా వైరస్కు త్వరలోనే విరుగుడు పడుతుందని ఆశిస్తున్నాను. వైరస్కు వేగంగా తెరపడితేనే పారాలింపిక్స్, ఒలింపిక్స్ సాఫీగా నిర్వహించడానికి వీలుంటుంది. ఒలింపిక్ గ్రామంలో నివసించే 11,000 మంది అథ్లెట్లు వైరస్ భయం లేకుండా ఉండగలిగే వాతావరణం కోరుకుంటున్నాం. ప్రయాణ నిషేధాజ్ఞాలతో ఇప్పటికే క్రీడాభిమానుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే జపాన్ ఇన్ఫెక్షన్లు, సైబర్ భద్రత, ట్రాఫిక్ ప్రయాణ వ్యవస్థల రూపంలో సమస్యలు ఎదుర్కొంటుంది. ఒలింపిక్స్ నిర్వహణ ఏర్పాట్లపై ఒలింపిక్ సంఘం (ఐఓసీ) సంతృప్తి వ్యక్తం చేసింది. సంబంధిత విభాగాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాయని నమ్మకం ఉంది. ఒలింపిక్స్ నిర్వహణపై ఎటువంటి అనుమానం లేదు' అని నిర్వహణ కమిటీ సీఈవో తొషిరో ముటో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో వ్యాఖ్యానించారు.