Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కత : ఆధునిక క్రికెట్లో సంచలన టోర్నీగా అంచనాలు అందుకుంటున్న సూపర్ సిరీస్ చర్చలు ఆరంభం కానున్నాయి!. బుధవారం కోల్కత నుంచి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ లండన్ బయల్దేరాడు.ఈసీబీ ఉన్నతాధికారులతో గంగూలీ సూపర్ సిరీస్పై కీలక చర్చలు జరుపనున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఉన్నతాధికారులు సైతం ఈ సమావేశానికి హాజరు కానున్నట్టు సమాచారం. ' గంగూలీ బుధవారం కోల్కత నుంచి ఇంగ్లాండ్కు బయల్దేరాడు. నాలుగు దేశాల సూపర్ సిరీస్పై అక్కడ చర్చలు జరుపుతాడు. క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు సైతం పాల్గొననున్నారు. సూపర్ సిరీస్పై పురోగతిపై పూర్తి స్పష్టత రావాల్సిన కొన్ని అంశాలు ప్రభావం చూపనున్నాయి' అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ముక్కోణపు టోర్నీ నిర్వహణకు సభ్య దేశాలు నిర్ణయం తీసుకోవచ్చు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే ఆసియా కప్నకు మినహా మరో మూడు, అంతకంటే ఎక్కువ దేశాలు పాల్గొనే టోర్నీ నిర్వహించే హక్కు సభ్య దేశాలకు లేదు. ఈ విషయంలో బీసీసీఐ, ఈసీబీ, సీఏలు ప్రస్తుత సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.