Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్
న్యూఢిల్లీ : ఎమ్మెస్కే ప్రసాద్ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా పనిచేసిన కాలంలో అత్యంత ఎక్కువ చర్చకు దారితీసిన అంశం ఎం.ఎస్ ధోని భవితవ్యం. ప్రసాద్ కమిటీ అనుభవంపై ప్రశ్నలు ఓవైపు, భవిష్యత్ ప్రణాళికలపై ధోనితో సెలక్టర్లు మాట్లాడారా? అని అందరూ చర్చించారు!. చీఫ్ సెలక్టర్గా ఇటీవల పదవీ కాలం ముగించుకున్న ఎమ్మెస్కే ఎం.ఎస్ ధోని భవిష్యత్పై వ్యవహరించిన తీరు పట్ల పెదవి విప్పాడు. 'సెలక్షన్ కమిటీ విషయానికి వస్తే యువ క్రికెటర్లకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు కల్పించటం, జట్టులో నిలదొక్కుకునే అవకాశం ఇవ్వటంపై మా దృష్టి నెలకొంది. ఎం.ఎస్ ధోని తన కెరీర్పై నిర్ణయం తీసుకోగలడు. సెలక్షన్ కమిటీ సభ్యుడిగా నా వృత్తి ధర్మాన్ని పక్కనపెడితే.. ధోనికి నా కంటే పెద్ద అభిమాని మరొకరు ఉండరు. ధోని అన్ని ఘనతలు సాధించాడు. రెండు ప్రపంచకప్లు, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, టెస్టుల్లో నం.1 కిరీటం సాధించాడు. ధోనిని ఎవరూ ప్రశ్నించలేరు. అతని కెరీర్పై ధోనే నిర్ణయం తీసుకుంటాడు. సెలక్లర్లుగా భావితరం క్రికెటర్లను గుర్తించి, నిలకడగా అవకాశాలు కల్పించటం మా పని' అని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు.
రాయుడు పట్ల బాధపడ్డా! : అంబటి రాయుడితో కలిసి డ్రెస్సింగ్రూమ్ పంచుకున్న ఆటగాడిగా అతడి విషయంలో ఎంతో బాధపడ్డాను. రాయుడు విషయంలో జరిగినది నా మనసుకు తగిలింది. 2016 జింబాబ్వే పర్యటన తర్వాత అంబటి రాయుడు టెస్టు ప్రణాళికల్లోకి రావాలని సెలక్షన్ కమిటీ భావించింది. అదే విషయాన్ని నేను రాయుడుతో ప్రస్తావించాను. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా రాయుడిని వన్డేల్లోకి ఎంపిక చేశాం. ఎన్సీఏలో రాయుడు ఫిట్నెస్ మెరుగుపర్చేందుకు నెల పాటు సహకరించాం. అయినా, అతడి విషయంలో జరిగిన దానికి ఇప్పటికీ ఎప్పటికీ బాధపడతాను. ఇక కరుణ్ నాయర్ విషయానికొస్తే అందరూ ట్రిపుల్ సెంచరీ గురించే మాట్లాడతారు. కానీ కరుణ్ నాయర్ నిలకడగా రాణించలేకపోయాడు. కొడితే భారీ స్కోర్లు, లేదంటే స్వల్ప స్కోర్ల ప్రదర్శన కరుణ్ ్ ఎంపికపై ప్రభావం చూపింది అని ప్రసాద్ అన్నాడు.c