Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్
ఆక్లాండ్ : ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఎక్కడైనా బ్యాట్తో, బంతితో ప్రత్యర్థులపై అత్యంత కఠినంగా విరుచుకుపడే బృందంగా కోహ్లిసేనకు పేరుంది. 2019 వరల్డ్కప్ వరకూ ఫీల్డింగ్లోనూ కోహ్లిసేన కఠినమైన జట్టుగానే నిలిచింది. కానీ తర్వాత వరుస సిరీస్ల్లో టీమ్ ఇండియా ఫీల్డింగ్ ప్రమాణాలు పడిపోతున్నాయి. టీమ్ ఇండియా దృష్టి సారించాల్సిన అంశాల్లో ఫీల్డింగ్ సైతం ఉందని సహాయక కోచ్ ఆర్. శ్రీధర్ పేర్కొన్నాడు. ' భారత జట్టు కచ్చితంగా దృష్టి సారించాల్సిన అంశం ఫీల్డింగ్. వరల్డ్కప్ తర్వాత వెస్టిండీస్లో మెరుగైన ప్రదర్శన చేశాం. స్వదేశంలో వెస్టిండీస్ సిరీస్లో క్యాచులు వదిలేయటం మొదలైంది. అప్పట్నుంచి మెరుగయ్యేందుకు పాటుపడుతున్నాం. ప్రపంచకప్ తర్వాత ప్రమాణాలను అందుకోలేకపోతున్నాం. దీనిపై దృష్టి సారిస్తాం. ఫీల్డింగ్ను మేం సులువుగా మెరుగు పర్చవచ్చు. మైదానం కొలతలు, బంతి గమనం సైతం ప్రభావం చూపుతున్నాయి. వీటికి తోడు బిజీ షెడ్యూల్ను సైతం ఓ సాకుగా చూపి తప్పించుకోలేం. తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్ రాస్ టేలర్ క్యాచ్ వదిలేసినప్పుడు, బహుశా తన తొలి ఓవర్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడేమో!. మనీశ్ పాండే రనౌట్ కోసం విసిరిన డైరెక్ట్ త్రోతో అదనంగా నాలుగు పరుగులు కోల్పోయాం. ఆ సమయంలో టామ్ లేథమ్ కివీస్ బెస్ట్ బ్యాట్స్మన్. అతడి వికెట్ కోసం మనీశ్ పాండే ఆ సమయంలో ఆ పని చేశాడు. అందులో ఎటువంటి పొరపాటు లేదు' అని ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ అన్నాడు. రాస్ టేలర్ వ్యక్తిగత స్కోరు 10 వద్ద ఉండగా రవీంద్ర జడేజా బౌలింగ్లో గాల్లోకి లేచిన క్యాచ్ను కుల్దీప్ యాదవ్ వదిలేశాడు. టామ్ లేథమ్ రనౌట్ అవకాశం మనీశ్ పాండే డైరెక్ట్ త్రో తృటిలో మిస్సయింది. ఈ రెండు అవకాశాలు, లేదా ఏదైనా ఒకటి భారత్ తనకు అనకూలంగా మలచుకుని ఉంటే హామిల్టన్ వన్డే ఫలితం కచ్చితంగా మరోలా ఉండేదని చెప్పవచ్చు!.