Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివాదం రేపుతోన్న అనధికార ప్రాతినిథ్యం
న్యూఢిల్లీ : ప్రపంచ కబడ్డీ చాంపియన్షిప్స్లో పాల్గొనేందుకు భారత కబడ్డీ జట్టు పాకిస్థాన్లో ప్రవేశించటం వివాదం రేపుతోంది. పాకిస్థాన్ తొలిసారి ప్రపంచ కబడ్డీ చాంపియన్షిప్స్కు ఆతిథ్యం వహిస్తోంది. సోమవారం నుంచి ఆరంభం కానున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, జర్మనీ, ఇరాన్, అజర్బైజాన్, సెర్రా లియోన్, కెన్యా, కెనడాలు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత కబడ్డీ జట్టు శనివారం వాఘా సరిహద్దు నుంచి పాకిస్థాన్లో కాలుమోపింది. పాకిస్థాన్ పంజాబ్ క్రీడా శాఖ మంత్రి రారు తైమూర్ భారత జట్టుకు లాహౌర్లోని హౌటల్ వద్ద స్వాగతం తెలిపారు. పాకిస్థాన్ కబడ్డీ సమాఖ్య అధికారులు వాఘా సరిహద్దు వద్ద పుష్ఫగుచ్చాలతో భారత అథ్లెట్లను స్వాగతించారు. అక్కడ్నుంచి భారీ భద్రత నడుమ ఆటగాళ్లను హౌటల్కు తీసుకెళ్లారు. అయితే, పాకిస్థాన్లో పర్యటించేందుకు భారత కబడ్డీ జట్టుకు క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి అనుమతి లభించలేదు. నిబంధనల ప్రకారం విదేశీ టోర్నీల్లో పాల్గొనే ఏదేని భారత జట్టు సంబంధింత క్రీడా సమాఖ్య ద్వారా క్రీడా శాఖ, హౌం శాఖ, విదేశాంగ శాఖలకు అనుమతి లేఖలు పంపాల్సి ఉంటుంది. పాక్కు వెళ్లిన కబడ్డీ జట్టు విషయంలో ఈ ప్రక్రియలో ఏ ఒక్కటీ పాటించలేదు. భారత కబడ్డీ ఫెడరేషన్ (ఎకెఎఫ్ఐ)కి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎస్పీ గార్గ్ నేతృత్వం వహిస్తున్నారు. ' పాకిస్థాన్లో పర్యటించే జట్టుపై ఎటువంటి సమాచారం లేదు. కబడ్డీ సమాఖ్య ఏ జట్టుకూ దీనిపై అనుమతి ఇవ్వలేదు. దీనిపై ఆలస్యంగా సమాచారం అందింది. ఇటువంటి పనులను సమాఖ్య ప్రోత్సహించదు. నిబంధనలను మీరిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం' అని జస్టిస్ ఎస్పీ గార్గ్ పేర్కొన్నారు.