Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అండర్-19 పపంచకప్ బంగ్లాదేశ్దే
- ఉత్కంఠ ఫైనల్లో అపురూప విజయం
- అక్బర్ అలీ, పర్వెజ్ సూపర్ ఇన్నింగ్స్
- జైస్వాల్, బిష్ణోరు మెరుపులు వృథా
పోచెస్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా)
అంతర్జాతీయ వేదికపై బరిలో నిలిచే వారందరూ సమవుజ్జీలే. బలాబలాలు, నైపుణ్యం విషయంలో పెద్ద వ్యత్యాసం కనిపించదు. ఒత్తిడిలో, నరాలు తెగే ఉత్కంఠలో ధృడమైన సంకల్పంతో, భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకునే జట్టు విజేతగా నిలుస్తుంది. 2020 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో అదే జరిగింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 85/5 పీకల్లోతు కష్టాల్లో పడినా కలవరానికి గురికాలేదు. పర్వెజ్ హుస్సేన్ (47, 79 బంతుల్లో 7 ఫోర్లు), కెప్టెన్ అక్బర్ అలీ (43 నాటౌట్, 77 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతయుత ఇన్నింగ్స్ బంగ్లాదేశ్ను విజేతగా నిలిపాయి. డక్వర్త్ లూయిస్ ప్రకారం కుదించిన 170 పరుగుల ఛేదనను బంగ్లాదేశ్ 42.1 ఓవర్లలోనే ఛేదించింది. తొలిసారి ఐసీసీ వరల్డ్కప్ను (అండర్19)ను బంగ్లాదేశ్కు తీసుకెళ్లింది. ఏ స్థాయి, ఏ ఫార్మాట్ క్రికెట్లోనైనా బంగ్లాదేశ్కు ఇదే తొలి ప్రపంచకప్ విజయం. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (88, 121 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 177 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ టైటిల్ పోరులో 3 వికెట్లతో తేడాతో గెలుపొందింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో భారత బౌలర్లు గీత దాటారు. 33 పరుగులు అదనంగా ఇచ్చుకుని భారీ మూల్యం చెల్లించారు.
బిష్టోరు స్పిన్ మాయ : ప్రపంచకప్ ఫైనల్లో లక్ష్యం 178. బలమైన బౌలింగ్ బృందం కలిగిన భారత్కు ఇది నిలుపుకోవటం కొత్త కాదు. కానీ వరల్డ్కప్లో ఛేదనలో విజయవంతమైన జట్టు బంగ్లాదేశ్పై నిలుపుకోవటం పెద్ద సవాల్. ఓపెనర్లు పర్వెజ్ హుస్సేన్ (47, 79 బంతుల్లో 7 ఫోర్లు), తన్జిద్ హసన్ (17, 25 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కుత 50 పరుగులు జోడించి శుభారంభం అందించారు. స్వల్ప లక్ష్యాన్ని నిలుపుకునే క్రమంలో భారత పేసర్లు ఒత్తిడిలో లయ కోల్పోయారు. అంతా బంగ్లాదేశ్ అనుకున్న విధంగానే సాగుతోంది. ఈ పరిస్థితుల్లో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోరు రంగంలోకి దిగాడు. కండ్లచెదిరే గూగ్లీలు, రాంగ్ఆన్లతో బంగ్లా బ్యాట్స్మెన్ను బెంబేలెత్తించాడు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే చేయాల్సిన నష్టం చేసేశాడు. హన్జిద్ హసన్ (17), మహ్మదుల్ జోరు (8), తోవిద్ (0), షహదత్ (1) వికెట్లు కూల్చిన బిష్ణోరు బంగ్లా ఛేదనను ఛిద్రం చేశాడు!. 50/0తో దూకుడుగా కనిపించిన బంగ్లా 65/4తో పీకల్లోతు ఒత్తిడిలో కూరుకుంది. షమిమ్ హుస్సేన్ (7), అవిషేక్ దాస్ (5) సైతం ఒత్తిడిలో నిలువలేదు. 85/5, 102/6తో బంగ్లా వెనుకంజ వేయగా, మ్యాచ్పై భారత్ పట్టు బిగించింది.
కెప్టెన్సీ పోరాటం : కఠిన సమయంలో ఓపెనర్ పర్వెజ్ హుస్సేన్ (47, 79 బంతుల్లో 7 ఫోర్లు)తో కలిసి కెప్టెన్ అక్బర్ అలీ( 43 నాటౌట్, 77 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) మరుపురాని ఇన్నింగ్స్ నమోదు చేశాడు. పర్వెజ్కు చక్కటి సహకారం అందించి, ఏడో వికెట్కు విలువైన 41 పరుగులు జోడించాడు. రన్రేట్ అనుకూలంగా ఉండటంతో, ఈ ఇద్దరూ రిస్క్ లేకుండా పరుగులు రాబట్టారు. ఏడు ఫోర్లతో మెరిసిన పర్వెజ్ను పార్ట్టైమ్ బౌలర్ జైస్వాల్ వెనక్కి పంపటంతో మళ్లీ ఉత్కంఠ రేగింది. రాకిబుల్ హసన్ (9 నాటౌట్, 25 బంతుల్లో 1 ఫోర్) క్రీజులో పట్టుదలగా నిలువటంతో ఛేదన మరో ఎండ్లో అక్బర్ అలీ చూసుకున్నాడు!. 41 ఓవర్లలో 163/7 ఉన్న సమయంలో వర్షం కారణంగా ఆటకు స్వల్ప అంతరాయం కలిగింది. డక్వర్ల్ లూయిస్ పద్దతిలో బంగ్లా లక్ష్యాన్ని 46 ఓవర్లలో 170 పరుగులకు కుదించారు. 30 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన యువ బంగ్లా ఏడు బంతుల్లోనే ఏడు పరుగులు చేసింది. బంగ్లాదేశ్కు తొలి ప్రపంచకప్ను అందించి చరిత్ర సృష్టించింది.
జైస్వాల్ ఒక్కడే : టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ ఛేదనను ఎంచుకుంది. పాకిస్థాన్ను ఓడించిన పిచ్పై తొలుత బ్యాటింగ్కు వచ్చిన భారత్ ఆరంభంలోనే ఓపెనర్ దివ్యాన్షు సక్సెనా (2)ను కోల్పోయింది. హైదరాబాదీ బ్యాట్స్మన్ తిలక్ వర్మ (38, 65 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (88) 94 పరుగులు జోడించాడు. తాజా పిచ్ను సద్వినియోగం చేసుకున్న బంగ్లా సీమర్లు భారత్ను ఇబ్బంది పెట్టారు. షార్ట్ బంతులతోనే దాడి చేసిన పేసర్లు అంత తేలిగ్గా పరుగులు ఇవ్వలేదు. జైస్వాల్, తిలక్ వర్మ బంగ్లా పేసర్లను సమర్థవంతంగా నిలువరించారు. స్పిన్నర్లనూ ముందుగానే ప్రయోగించినా, వికెట్ కోల్పోలేదు. ఓ సిక్సర్, 8 ఫోర్లు కొట్టిన జైస్వాల్ 89 బంతుల్లో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. జైస్వాల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్తో భారత్ మెరుగైన స్కోరు దిశగా సాగింది. క్రీజులో కుదురుకున్న తిలక్ వర్మ నిష్క్రమణ, ఆ వెంటనే కెప్టెన్ ప్రియాం గార్గ్ (2) వికెట్ భారత్ను ఒత్తిడిలో పడేసింది. మరో ఎండ్లో జైస్వాల్ ఉండటంతో భారత్ దీమాగానే కనిపించింది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (22)తో కలిసి జైస్వాల్ మరో కీలక భాగస్వామ్యం దిశగా సాగాడు. కానీ షోరిఫుల్ ఇస్లాం జైస్వాల్ను వెనక్కి పంపించటంతో కథ మారిపోయింది. 156/3తో పటిష్టంగా కనిపించిన యువ భారత్, 177/10తో కుప్పకూలింది. భారత్ ఇన్నింగ్స్ : యశస్వి జైస్వాల్ (సి) హసన్ (బి) షోరిఫుల్ 88, దివ్యాన్షు సక్సెనా (సి) హసన్ జోరు (బి) అవిషేక్ దాస్ 2, తిలక్ వర్మ (సి) షోరిఫుల్ (బి) షకిబ్ 38, ప్రియాం గార్గ్ (సి) షకిబ్ (బి) రాకిబుల్ 7, ధ్రువ్ జురెల్ (రనౌట్) 22, సిద్దేశ్ వీర్ (ఎల్బీ) షోరిఫుల్ 0, అతర్వ (బి) అవిషేక్ దాస్ 3, రవి బిష్ణోరు (రనౌట్) 2, సుశాంత్ (సి) షోరిఫుల్ (బి) షకిబ్ 3, కార్తీక్ (సి) అక్బర్ (బి) అవిషేక్ దాస్ 0, ఆకాశ్ సింగ్ నాటౌట్ 1, ఎక్స్ట్రాలు : 11, మొత్తం : (47. ఓవర్లలో ఆలౌట్) 177.
వికెట్ల పతనం : 1-9, 2-103, 3-114, 4-156, 5-156, 6-168, 7-170, 8-170, 9-172, 10-177.
బౌలింగ్ : షోరిఫుల్ ఇస్లాం 10-1-31-2, హసన్ షకిబ్ 8.2-2-28-2, అవిషేక్ దాస్ 9-0-40-3, షమిమ్ హుస్సేన్ 6-0-36-0, రాకిబుల్ హసన్ 10-1-29-1, తోవిద్ 4-0-12-0.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ : పర్వేజ్ హుస్సేన్ (సి) ఆకాశ్ (బి) జైస్వాల్ 47, తాన్జిద్ హసన్ (సి) కార్తీక్ (బి) బిష్ణోరు 17, మహ్మదుల్ హసన్ (బి) బిష్ణోరు 8, షహదత్ హుస్సేన్ (స్టంప్డ్) ధ్రువ్ జురెల్ (బి) బిష్ణోరు 1, అక్బర్ అలీ నాటౌట్ 43, షమిమ్ హుస్సేన్ (సి) జైస్వాల్ (బి) సుశాంత్ 7, అవిషేక్ దాస్ (సి) కార్తీక్ (బి) సుశాంత్ 5, రాకిబుల్ హసన్ నాటౌట్ 9,
వికెట్ల పతనం : 1-50, 2-62, 3-62, 4-65, 5-85, 6-102, 7-143.
బౌలింగ్ : కార్తీక్ త్యాగి 10-2-33-0, సుశాంత్ మిశ్రా 7-0-25-2, ఆకాశ్ సింగ్ 8-1-33-0, రవి బిష్ణోరు 10-3-30-4, అతర్వ 4.1-0-22-0, జైస్వాల్ 3-0-15-1.