Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్లో కబడ్డీ జట్టు ప్రాతినిథ్య వివాదం
న్యూఢిల్లీ : భారత కబడ్డీ సమాఖ్య (ఏకెఎఫ్ఐ) నుంచి అనుమతి లేదు. భారత క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి అనుమతి లేదు. భారత ఒలింపిక్ సంఘం (ఓఓఏ) అధికారులకు కనీస సమాచారం లేదు. విదేశీ పర్యటన కోసం విదేశాంగ శాఖకు ఎటువంటి అభ్యర్థన రాలేదు. అయినా, పాకిస్థాన్లో జరుగుతున్న ప్రపంచ కబడ్డీ చాంపియన్షిప్స్లో పాల్గొనేందుకు భారత జట్టు లాహౌర్కు చేరుకుంది. దీనిపై ఇప్పటికే భారత కబడ్డీ సమాఖ్యలో వివాదం రేగుతోంది. శనివారం వాఘా సరిహద్దు గుండా భారత కబడ్డీ బృందాన్ని పాకిస్థాన్ స్వాగతించింది. ఈ వివాదంపై ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరెందర్ బత్రా స్పందించారు. ' ఐఓఏ ఏ జట్టుకూ గుర్తింపు, అనుమతి ఇవ్వలేదు. పాకిస్థాన్కు ఎవరు వెళ్లారో తెలియదు. ఎంతమంది వెళ్లారు అనేది తెలియరాలేదు. కబడ్డీ సమాఖ్య భారత ఒలింపిక్ సంఘం మెంబర్. అధికారికంగా ఏ జట్టును పంపలేదని వారు చెప్పారు. క్రీడా శాఖ ప్రకటనను సైతం చూశాం. అయినా, పాకిస్థాన్కు వెళ్లినది ఎవరు అనేది ప్రశ్నార్థకం. ఎవరైనా వ్యక్తిగతంగా వెళ్లి భారత్ పేరును వినియోగించునే వీలు లేదు. సంబంధిత క్రీడా సమాఖ్య అనుమతితో వెళ్లిన జట్టు, ఐఓఏ గుర్తింపు ఇచ్చిన జట్టుకు మాత్రమే భారత జట్టు పేరును వినియోగించుకునే హక్కు ఉంటుంది. ఈ విషయంలో పాక్ గురించి మాట్లాడబోను. వారు అనుకున్నది సాధించేందుకు ఎంతకైనా దిగజారుతారు' అని నరెందర్ బత్రా పేర్కొన్నాడు. సోమవారం నుంచి ఆరంభమైన వరల్డ్ కబడ్డీ చాంపియన్షిప్స్లో పది జట్లు పాల్గొంటున్నాయి. గత ఆరు వరల్డ్కప్లు భారత్లో జరుగగా, అన్నింటా టీమ్ ఇండియా విజయం సాధించింది.