Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్: ఐసీసీ అండర్-19 వరల్డ్కప్ ఫైనల్స్ తర్వాత చోటుచేసుకున్న సంఘటనలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తీవ్రంగా పరిగణించింది. ఫైనల్స్ మ్యాచ్ ఆఖరు నిమిషాల ఫుటేజీ పరిశీలించిన మ్యాచ్ రిఫరీ ఇరు జట్లకు చెందిన ఐదుగురు క్రికెటర్లపై చర్యలు తీసుకున్నారు. భారత్, బంగ్లాదేశ్ తలపడిన తొలి ఐసీసీ అండర్19 వరల్డ్కప్ ఫైనల్స్లో బంగ్లా కుర్రాళ్లు భావోద్వేగాలు అదుపులో పెట్టుకోలేదు. విజయానంతరం భారత కుర్రాళ్లను ఉద్దేశించి వెకిలి చేష్టలు చేయటమే కాదు క్రీడా స్ఫూర్తి మరిచి ప్రవర్తించారు. భారత్కు చెందిన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోరు, పేస్ బౌలర్ ఆకాశ్ సింగ్లపై ఐసీసీ చర్యలు తీసుకుంది. బంగ్లాదేశ్కు చెందిన ముగ్గురు క్రికెటర్లు తొవిద్ హృదరు, షామిమ్ హుస్సేన్, రాకిబుల్ హసన్లు సైతం క్రమశిక్షణ నియామవళి ఉల్లంఘించినట్టు రిఫరీ గుర్తించారు. ఐసీసీ ఆటగాళ్ల క్రమశిక్షణ నియామవళి ప్రకారం ఐసీసీ ఈ ఐదుగురు క్రికెటర్లపై చర్యలు తీసుకుంది.