Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మేం గెలుపు రేసులో నిలిచింది తొలి మ్యాచ్లోనే అనుకుంటా. మూడు మ్యాచుల్లో ఓవరాల్గా మా ప్రదర్శన అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోలేదు. ఫీల్డింగ్లోనూ ఏమంత మెరుగైన ప్రదర్శన చేయలేదు. కివీస్ గడ్డపై టీ20ల్లో గొప్పగా ఆడాం. వన్డేల్లో కొత్త ఆటగాళ్లకు మంచి అనుభవం లభించింది. టీ20 సిరీస్ తర్వాత న్యూజిలాండ్ గొప్ప సంకల్పంతో ఆడింది. 3-0 విజయానికి న్యూజిలాండ్ అర్హమైన జట్టు. ఈ ప్రదర్శనతో మాకు గెలుపు అర్హత లేదు. టెస్టు చాంపియన్షిప్స్ రేసులో ప్రతి టెస్టూ ఉత్కంఠగా సాగనుంది. భారత్కు మంచి సమతూకమైన టెస్టు జట్టు ఉంది. ఇక్కడ టెస్టు సిరీస్ నెగ్గగలమనే విశ్వాసం మాకుంది'
- విరాట్ కోహ్లి, భారత కెప్టెన్