Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదర్భతో హైదరాబాద్ రంజీ మ్యాచ్
నవతెలంగాణ, హైదరాబాద్ : రంజీ ట్రోఫీలో చివరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ సహజంగానే నిరాశపరిచే ప్రదర్శన చేస్తోంది. డిఫెండింగ్ చాంపియన్ విదర్బతో ఉప్పల్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 239/7తో కొనసాగుతోంది. విదర్భ సీమర్లు రజ్నీశ్ గుర్బాని (3/48), యశ్ ఠాకూర్ (4/44)లు చెలరేగటంతో హైదరాబాద్ వేగంగా వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్లో కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (5), అక్షిత్ రెడ్డి (6)లు విఫలమయ్యారు. రాహుల్ రవీందర్ (52, 82 బంతుల్లో 9 ఫోర్లు), రవితేజ (44, 62 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. ప్రతీక్ రెడ్డి (76 నాటౌట్, 159 బంతుల్లో 8 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీతో రాణించాడు. మెహది హసన్ (27 నాటౌట్)తో కలిసి ప్రతీక్ క్రీజులో అజేయంగా ఆడుతున్నాడు. కొల్ల సుమంత్ (1), సివి మిలింద్ (4), అనికెత్ రెడ్డి (4) విఫలమయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 239/7తో నిలిచింది.