Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫామ్ కోల్పోయిన బుమ్రా, షమి
- గాయం నుంచి కోలుకోని ఇషాంత్
- ఉమేశ్ యాదవ్పైనే ఇప్పుడు ఆశలు
నవతెలంగాణ క్రీడా విభాగం
ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లిని అంత సులువుగా పడగొట్టే బౌలర్ లేడు. ప్రపంచ బ్యాట్మ్మెన్లో జశ్ప్రీత్ బుమ్రాను ఎదురొడ్డి నిలిచే మొనగాడు లేడు. వరల్డ్ నం.1 బ్యాట్స్మన్, వరల్డ్ నం.1 బౌలర్ అండతో టీమ్ ఇండియా అన్ని ఫార్మాట్లలో జైత్రయాత్ర కొనసాగించింది. న్యూజిలాండ్ పర్యట నలో అది టీ20 సిరీస్లో కొనసా గినా, వన్డే ఫార్మాట్లో కథ మారింది. అత్యుతమ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి సామర్థ్యంపై సందే హాలు లేకపో యినా.. అత్యుత్తమ బౌలర్ జశ్ప్రీత్ బుమ్రా సత్తాపై ఇప్పుడు కొత్త ప్రశ్నలు వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో ప్రధాన సీమర్గా జశ్ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేదు. 30 ఓవర్లలో ఒక్క న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ను సైతం పెవిలియన్కు చేర్చలేదు. మరోవైపు నయా అస్త్రం మహ్మద్ షమి సైతం తేలిపోయాడు. బౌలర్ల వైఫల్య ఫలితంగా వన్డే సిరీస్ను టీమ్ ఇండియా 0-3తో కోల్పోయింది. ఇదే సమయంలో న్యూజిలాండ్ బౌలర్లు భారత బ్యాటింగ్ ఆర్డర్ దూకుడును నిలువరించటంలో విజయవం తమైంది. ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్స్కు అడుగు దూరంలో నిలిచిన టీమ్ ఇండియాకు న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో 120 పాయింట్లు కీలకం. ఇక్కడ రెండు టెస్టులు నెగ్గితే, 2021 లార్డ్స్ ఫైనల్లో బెర్త్ సొంతం చేసుకోనుంది. రెండు టెస్టుల సిరీస్ ఫిబ్రవరి 21న వెల్లింగ్టన్ సవాల్తో ఆరంభం కానుంది.
పేసర్లపైనే బెంగ : భారత టెస్టు విజయాల్లో పేసర్లు కీలక భూమిక వహించారు. స్వదేశంలో జరిగిన టెస్టుల్లో సైతం స్పిన్నర్లను పక్కనకు నెట్టి పేసర్లే వికెట్లు కూల్చారు. భారత్ టెస్టుల్లో వరల్డ్ నం.1గా నిలువటంలో పేసర్ల పాత్ర కీలకం. ప్రత్యేకించి ప్రమాదకర పేసర్ జశ్ప్రీత్ బుమ్రా పాత్ర ఎక్కువ. స్వల్ప కెరీర్లోనే ఇంగ్లాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా గడ్డపై ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి ఆసియా బౌలర్గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్కు ముందు గాయం బారిన పడిన బుమ్రా కొంత కాలం క్రికెట్కు దూరమయ్యాడు. ఫిట్నెస్ సాధించిన తర్వాత నేరుగా శ్రీలంకతో టీ20కు జట్టులోకి వచ్చాడు. కీలక న్యూజిలాండ్ పర్యటనలో బుమ్రాకు టీ20ల్లో చేదు అనుభవం ఎదురైంది. ఆఖరు టీ20లో మూడు వికెట్లతో మెరిసినా, ఓవరాల్గా బుమ్రా ప్రదర్శన సంతృప్తికరం కాదు. వన్డేల్లో అతడి ప్రదర్శన మరీ దారుణం. 0/53, 0/64, 0/50 గణాంకాలతో మూడు వన్డేల్లోనూ వికెట్ తీసుకోలేకపోయాడు. న్యూజిలాండ్ బ్యాట్స్మన్ బుమ్రాను అలవోకగా ఎదుర్కొన్నారు. సహజంగా డెత్ ఓవర్లలో బుమ్రా ప్రభావం ఎక్కువ. కానీ అక్కడా బుమ్రాను కివీస్ బ్యాట్స్మెన్ ఛేదించారు. బుమ్రా లెంగ్త్ను, లైన్ను కివీస్ బ్యాట్స్మెన్ పట్టేశారు. అతడిని లెగ్ సైడ్లో అలవోకగా బాదుతున్నారు. బుమ్రా వైఫల్యంతో ఛేదనలో కివీస్ ఒత్తిడి లేకుండా ఆడగల్గింది. టెస్టు సిరీస్లో సైతం బుమ్రా లయ అందుకోకుంటే, కొత్తగా బరిలోకి దిగకుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. మ్యాచ్కు ముందే న్యూజిలాండ్కు ఇది అదనపు అనుకూలతగా మారనుంది. మరో సీమర్ మహ్మద్ షమి గణాంకాలు సైతం ఆందోళనకరంగా ఉన్నాయి. తొలి రెండు టీ20ల్లో వికెట్లు తీయలేని షమి, హామిల్టన్ టీ20లో రెండు వికెట్లతో పాటు సూపర్ ఓవర్కు మ్యాచ్కు తీసుకెళ్లే ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత తొలి వన్డేలో 1/63తో నిరాశపరిచాడు. టెస్టుల్లో మహ్మద్ షమి రెండో ఇన్నింగ్స్లో అత్యంత ప్రమాదకర బౌలర్. బంతి పాతబడిన తర్వాత షమి టెస్టుల్లో ప్రభావం చూపిస్తాడనే అంచనాలు ఉన్నాయి. నవదీప్ సైని ఫర్వాలేదనిపిస్తున్నాడు. కానీ కీలక రెండు టెస్టుల్లో పేసర్లు సమష్టిగా రాణిస్తేనే, లార్డ్స్ ఫైనల్స్కు భారత్ బెర్త్ బుక్ చేసుకోనుంది.
ఇషాంత్కు 15న పరీక్ష : జట్టుతో ఉన్న ముగ్గురు పేసర్లు ఫామ్లో లేరు. ఫామ్లో ఉన్న సీనియర్ సీమర్కు ఫిట్నెస్ లేదు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఫిబ్రవరి 15న బెంగళూర్లోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఫిట్నెస్ పరీక్ష ఎదుర్కొనున్నాడు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రంజీ మ్యాచ్లో ఇషాంత్ శర్మ చీలమండ గాయానికి గురయ్యాడు. న్యూజిలాండ్ సిరీస్కు ఇషాంత్ను ఎంపిక చేసినా, ఫిట్నెస్ సాధించిన తర్వాతనే వెల్లింగ్టన్ పంపించాలని సూచించారు. ఇప్పటికే ఉమేశ్ యాదవ్ టెస్టుతో చేరాడు. ఇషాంత్ శర్మ ఎన్సీఏలో ఫిట్నెస్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు టెస్టు సిరీస్కు దూరమైన హార్దిక్ పాండ్య సైతం ఎన్సీఏలో రిహాబిలేషన్లో ఉన్నాడు. ఇషాంత్తో కలిసి పాండ్య రెగ్యులర్ కసరత్తులు చేస్తూ కనిపించాడు. ఫిట్నెస్, ఫామ్లో ఉన్న ఉమేశ్ యాదవ్పైనే కోహ్లిసేన ఆశలు పెట్టుకుంది. రంజీ ఫామ్లో ఉన్న ఉమేశ్ యాదవ్ను న్యూజిలాండ్ టీ20, వన్డేల్లో ఎదుర్కొలేదు. టెస్టు సిరీస్లో ఉమేశ్ యాదవ్ అధిక ప్రభావం చూపిస్తాడని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. ఫిబ్రవరి 14-16న టీమ్ ఇండియా టూర్ మ్యాచ్ ఆడనుంది. ఫిట్నెస్ పరీక్షలో పాసైతే, ఇషాంత్ శర్మ నేరుగా తొలి టెస్టు వేదిక వెల్లింగ్టన్కు చేరుకోనున్నాడు.