Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- థాయ్ లాండ్పై 3-2తో థ్రిల్లింగ్ విక్టరీ
- నేడు ఇండోనేషియాతో అమీతుమీ
మనీలా (ఫిలిప్పీన్స్) : ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్స్లో టీమ్ ఇండియా అద్భుతం చేసింది. ఏమాత్రం ఆశలు లేవని అనుకున్న వేళ థాయ్ లాండ్కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. సింగిల్స్ స్టార్ కిదాంబి శ్రీకాంత్, బి. సాయిప్రణీత్లు వరుస ఓటములు చవిచూడటంతో ఆసియా చాంపియన్షిప్స్లో భారత్ కథ ముగిసిందనే అనుకున్నారు. కానీ యువ కెరటం లక్ష్యసేన్, డబుల్స్ స్టార్స్ భారత్ను సెమీఫైనల్లో చేర్చారు. మూడో సింగిల్స్ మ్యాచ్లో లక్ష్యసేన్ 21-19, 21-18తో విజయం సాధించగా.. డబుల్స్ ఆటగాళ్లు లక్ష్యసేన్ను అనుసరించారు. ఆఖరు నిమిషంలో సాత్విక్సాయిరాజ్ రాంకీ రెడ్డి టోర్నీకి దూరమయ్యాడు. దీంతో డబుల్స్పై భారత్ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఎంఆర్ అర్జున్, ధ్రువ్ జోడీ 21-18, 22-20తో గెలుపొందగా, శ్రీకాంత్, చిరాగ్ జంట 21-15, 16-21, 21-15తో మూడు గేముల థ్రిల్లర్లో మెరుపు విజయం సాధించింది. శ్రీకాంత్ 20-22, 14-21, సాయిప్రణీత్ 21-14, 14-21, 12-21తో మూడు గేముల మ్యాచ్లో పరాజయం పాలయ్యాడు. నేడు సెమీఫైనల్లో ఇండోనేషియాతో తలపడనున్న భారత్ కనీసం కాంస్యం ఖాయం చేసుకుంది. చివరగా హైదరాబాద్ (2016)లో జరిగిన ఆసియా చాంపియన్షిప్స్లో భారత్ కాంస్య పతకం సాధించింది. మరో సెమీస్లో జపాన్, మలేషియాలు తలపడనున్నాడు. మహిళల సెమీఫైనల్లో జపాన్తో మలేషియా, థాయ్ లాండ్తో కొరియా ఆడనున్నాయి.