Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కివీస్ టెస్టులపై చీఫ్ కోచ్ రవిశాస్త్రి
హామిల్టన్ : 2020 టీ20 వరల్డ్కప్ క్యాలెండర్ ఏడాదిలో టీ20 సిరీస్ను 5-0తో క్లీన్స్వీప్ చేశాం. 0-3 వన్డే వైట్వాష్ ఓటమి ప్రస్తుతానికి అప్రాధ్యానం. 2021 లార్డ్స్ ఫైనల్లో ఆడేందుకు టెస్టులు కీలకమని భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో 120 పాయింట్లు సాధన, వరల్డ్ నం.1 జట్టుగా ఆడటమే లక్ష్యమని స్పష్టం చేశాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్లో భారత్ వెస్టిండీస్పై 2-0, దక్షిణాఫ్రికాపై 3-0, బంగ్లాదేశ్పై 2-0తో విజయాలు సాధించింది. మూడు సిరీస్ల్లో ఏడు టెస్టులు నెగ్గి 360 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ' 2021 లార్డ్స్ ఫైనల్స్కు మాకు మరో 100 పాయింట్లు అవసరం. ఆరు టెస్టుల్లో రెండు టెస్టుల్లో విజయాలు చాలు మాకు. ఆరు టెస్టుల్లో రెండు కివీస్తో, నాలుగు ఆసీస్తో ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్తో రెండు టెస్టుల్లోనూ నెగ్గి 120 పాయింట్లు సాధించటం మా తొలి ప్రాధాన్యం. కివీస్ పరిస్థితుల్లో సైతం వరల్డ్ నం.1 జట్టుగా మేటి ప్రదర్శన చేయటం మా రెండో లక్ష్యం' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. రోహిత్ శర్మ గాయంతో దూరమైనా పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్ రూపంలో భారత్కు ప్రతిభావంతమైన ఓపెనర్లు అందుబాటులో ఉన్నారని శాస్త్రి విశ్వాసం వెలిబుచ్చాడు.