Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదర్భతో రంజీ మ్యాచ్ డ్రా
నవతెలంగాణ, హైదరాబాద్ : రంజీ ట్రోఫీ 2019-20 సీజన్ను హైదరాబాద్ దారుణంగా ముగించింది. ఎలైట్ క్రాస్ పూల్లో అట్టడుగున 18వ స్థానంలో నిలిచింది. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో 6 పరాజయాలు చవిచూసిన హైదరాబాద్, కేరళతో మ్యాచ్లో మాత్రమే విజయం రుచి చూసింది. తాజాగా డిఫెండింగ్ చాంపియన్తో చివరి గ్రూప్ మ్యాచ్ను డ్రా చేసుకుంది. 8 మ్యాచుల్లో 7 పాయింట్లతో హైదరాబాద్ ఎలైట్ క్రాస్ పూల్లో 18వ స్థానంలో నిలిచింది. విదర్భతో మ్యాచ్లో హైదరాబాద్ 272, 244 పరుగులు చేసింది. విదర్భ తొలి ఇన్నింగ్స్లో 333 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్లో 184 పరుగుల లక్ష్య ఛేదనలో 116/3తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో శతకబాదిన ఫయజ్ ఫజల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. గుజరాత్, గోవా.. బెంగాల్, ఒడిశా... కర్ణాటక, జమ్మూ కాశ్మీర్.. సౌరాష్ట్ర, ఆంధ్ర జట్లు క్వార్టర్ఫైనల్స్కు అర్హత సాధించాయి.