Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రిస్బేన్ : ప్రతిష్టాత్మక మహిళల టీ20 వరల్డ్కప్కు ముందు అభిమానుల్లో ఆసక్తి రేపిన భారత్, పాకిస్థాన్ వార్మప్ మ్యాచ్కు వరుణుడు అడ్డు తగిలాడు. బ్రిస్బేన్లోని అలెన్ బోర్డర్ ఫీల్డ్లో ఎడతెరపి లేకుండా వర్షం కురువటంతో మైదానం చిత్తడిగా మారింది. భారీ వర్షంతో ఒక్క బంతి కూడా పడకుండానే భారత్, పాకిస్థాన్ మహిళల వార్మప్ మ్యాచ్ రద్దయ్యింది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమ్ ఇండియా మంగళవారం రెండో వార్మప్ మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడనుంది. ఫిబ్రవరి 21న భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్తో వరల్డ్కప్ ఆరంభం కానుంది.