Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి 1 నుంచి ధోని ఐపీఎల్ సాధన
చెన్నై : 2019 వరల్డ్కప్ సెమీఫైనల్స్ తర్వాత ఎం.ఎస్ ధోని మైదానంలో కనిపించలేదు. 2019, జులై 9 తర్వాత టీమ్ ఇండియాలో మహేంద్రసింగ్ ధోని భవితవ్యంపై నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. జాతీయ జట్టు తరఫున మహి కెరీర్పై అనుమానాలు నెలకొన్నా, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మహి కచ్చితంగా మరో రెండు సీజన్లు ఆడతాడనే నమ్మకం అభిమానుల్లో కనిపించింది. 2020 వరల్డ్కప్పై కన్నేసిన ధోని.. 2020 ఐపీఎల్ సన్నాహాకాన్ని మార్చి 1 నుంచి మొదలు పెట్టను న్నట్టు సమాచారం. సుమారు ఆరు నెలలుగా క్రికెట్కు దూరంగా ఉంటున్న ధోని కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. బిజీ కెరీర్లో ధోని తొలిసారి సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. ఇటీవలే జార్ఖండ్ రంజీ జట్టుతో కలిసి నెట్స్లో మెరిసిన ధోని మార్చి 1న చెన్నైకి చేరుకోను న్నాడు. ఈ మేరకు సీఎస్కే వర్గాలు ధ్రువీకరించాయి.
' ధోని మార్చి 1న చెన్నైకి రానున్నాడు. రెండు వారాల పాటు ధోని ప్రాక్టీస్ చేయనున్నాడు. తిరిగి 4-5 రోజుల విరామం తీసుకుని, ఐపీఎల్ ఆరంభానికి జట్టుతో చేరనున్నాడు. మార్చి 2 నుంచి సురేశ్ రైనా, అంబటి రాయుడులు ధోనితో కలిసి నెట్స్ను పంచుకోనున్నారు' అని చెన్నై సూపర్ కింగ్స్ వర్గాలు వెల్లడించాయి.