Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు వెస్టిండీస్తో వార్మప్ మ్యాచ్
సిడ్నీ : 2017 మహిళల వరల్డ్కప్ ఫైనల్స్. ఆతిథ్య ఇంగ్లాండ్కు 9 పరుగుల తేడాతో టీమ్ ఇండియా వన్డే వరల్డ్కప్ను కోల్పోయింది. భారత మహిళల క్రికెట్లో తీరని వేదన మిగిల్చిన ఈ సంఘటన ఇంకా అభిమానుల మదిలో తాజాగానే ఉంది!. మూడేండ్లు గడిచినా, 2017 వరల్డ్కప్ ఓటమిని అమ్మాయిలు అంత తేలిగ్గా మరిచిపోలేకపోతున్నారు. 2019 టీ20 వరల్డ్కప్ సెమీఫైనల్స్ను జట్టు సెలక్షన్స్లో రాజకీయ జోక్యం వివాదాలతో హర్మన్ప్రీత్ సేన ముగించింది. 2020 టీ20 వరల్డ్కప్కు టైటిల్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమ్ ఇండియా ఫిబ్రవరి 21న ఆతిథ్య ఆస్ట్రేలియాతో టోర్నీ ఆరంభ మ్యాచ్లో ఢకొీట్టనుంది. 2020 మహిళల ఐసీసీ టీ20 వరల్డ్కప్ ట్రోఫీ ఆవిష్కరణ, కెప్టెన్ల సమావేశంలో వరల్డ్కప్ విజయంపై హర్మన్ప్రీత్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ' భారత జట్టు రోజు రోజుకు మెరుగుపడుతుంది. జట్టులోని అందరూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తున్నారు. 2020 వరల్డ్కప్ నెగ్గితే, అది మాకు అతి పెద్ద విజయం అవుతుంది. 2017 వరల్డ్కప్ స్పందన చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. ఒత్తిడికి గురవుతారని, మా తల్లిదండ్రులు సైతం భారత్లో మహిళల క్రికెట్ పట్ల ఏర్పడిన అభిమానం గురించి చెప్పలేదు. ఇక్కడ నెగ్గితే కచ్చితంగా మాకు ఇది మెగా విజయం కానుంది. అందుకు భారత జట్టు శాయశక్తులు ఒడ్డుతుంది' అని హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొన్నది. సోమవారం కెప్టెన్ల సమావేశం సిడ్నీలోని తరొంగ జూపార్క్లో జరిగింది.