Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూజిలాండ్ : భారత్తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్కు ఆతిథ్య న్యూజిలాండ్ జట్టును ప్రకటించింది. మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టులో గాయపడిన కివీస్ ప్రధాన సీమర్ ట్రెంట్ బౌల్ట్ భారత్పై పునరాగమనం చేయనున్నాడు. వన్డే సిరీస్లో ఆకట్టుకున్న కైల్ జెమీసన్కు సెలక్టర్లు టెస్టు జట్టు ద్వారాలు తెరిచారు. న్యూజిలాండ్ జట్టులో అజాజ్ పటేల్ రూపంలో ఒక్కడే స్పిన్నర్ ఉన్నాడు.
న్యూజిలాండ్ టెస్టు జట్టు : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, కొలిన్ డీ గ్రాండ్హౌమ్, కైల్ జెమీసన్, టామ్ లేథమ్, డార్లీ మిచెల్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగర్, బ్రాడ్ వాట్లింగ్.