Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్విటర్లో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ
కోల్కత : ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం. అత్యాధునిక సదుపాయాలు. సెంటర్ పిచ్. 110000 మంది ప్రేక్షకులు కూర్చోనే సామర్థ్యం. అహ్మదాబాద్ ఆధునీకరించిన మోతెర మైదానం విశేషాలు ఇవి. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా గుజరాత్ క్రికెట్ సంఘం (జీసీఏ) మోతెరా స్టేడియాన్ని నిర్మించింది. అతిపెద్ద స్టేడియంలో తొలి మ్యాచ్ ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ మధ్య జరుగుతుందని తొలుత ప్రచారం జరిగింది. తర్వాత ఐపీఎల్ ఆల్ స్టార్ మ్యాచ్, ఐపీఎల్ ఫైనల్స్ అంటూ వార్తలొచ్చాయి. ఆ సమయానికి స్టేడియం అందుబాటులో వచ్చే అవకాశం లేదని, బీసీసీఐ వర్గాలు ఈ వార్తలను కొట్టిపారేశాయి. తాజాగా విడుదల చేసిన ఐపీఎల్ షెడ్యూల్లో నాకౌట్ మ్యాచుల వివరాలను వెల్లడించలేదు. మోతెరా స్టేడియం ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేసిన గంగూలీ ఆసక్తికర ప్రకటన చేశాడు. మే 24న ఐపీఎల్ ఫైనల్ జరుగనుంది. 24 వరకూ ఎదురుచూడలేను.. అంటూ గంగూలీ ట్వీట్ చేశాడు. దీంతో ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్ మోతెర స్టేడియంలో జరుగనుందని అధికారికంగా తేలిపోయింది. టీమ్ ఇండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి సైతం మోతెర స్టేడియం ఫోటోను సోషల్ మీడియాతో పంచుకున్నాడు.