Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడేజా, హర్షలతో వాదనే కారణం!
ముంబయి : కరోనా వైరస్ క్రీడా రంగాన్ని కుదిపేస్తోంది. ఐపీఎల్ సహా భారత్, దక్షిణాఫ్రికా సిరీస్లు రద్దయ్యాయి. అందరూ కరోనా వైరస్ గురించి చర్చిస్తున్న సమయంలో బీసీసీఐ తీసుకున్న ఓ కీలక నిర్ణయం పెద్దగా వార్తల్లోకి రాకుండా పోయింది!. భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ను బీసీసీఐ తన వ్యాఖ్యాతల ప్యానల్ నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం సునీల్ గవాస్కర్, ఎల్. శివరామకృష్ణన్, మురళీ కార్తీక్లు ధర్మశాలకు చేరుకున్నారు. కానీ సంజయ్ మంజ్రేకర్ ఎక్కడా కనిపించలేదు. 2019 వరల్డ్కప్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై అనుచిత వ్యాఖ్యలు, కోల్కత గులాబీ టెస్టు సందర్భంగా సహ వ్యాఖ్యాత హర్ష భోగ్లేను కించపరిచే వ్యాఖ్యలు చేసిన మంజ్రేకర్పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదం వేడిగా ఉన్నప్పుడు మౌనం దాల్చిన బీసీసీఐ, ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా వివాదస్పద వ్యాఖ్యాతను ప్యానల్ నుంచి తప్పించింది. జడేజా, హర్షలపై వ్యాఖ్యలకు సంజ్రేకర్ తర్వాత చింతించినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.