Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-క్రీడా మంత్రి కిరణ్ రిజుజు ట్వీట్
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కారణంగా క్రీడా పోటీలే కాదు క్రీడా పర్యటనలు సైతం వాయిదా పడుతున్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్ ఏర్పాట్లు, భారత జట్టుకు చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు మార్చి 25న భారత్ హై పవర్ కమిటీ జపాన్కు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో టోక్యో 2020 పర్యటనను వాయిదా వేస్తున్నట్టు స్వయంగా క్రీడా మంత్రి కిరణ్ రిజుజు ట్విటర్లో తెలిపారు. ' ప్రభుత్వ అధికారులు, భారత ఒలింపిక్ సంఘం సభ్యులతో కూడిన అత్యున్నత స్థాయి భారత బృందం ప్రతిపాదితి టోక్యో ఒలింపిక్స్ పర్యటన తాతాల్కికంగా వాయిదా పడింది' అని మంత్రి ట్వీట్ చేశారు. క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు, ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరెందర్ బత్రా, కార్యదర్శి రాజీవ్ మెహతా, బాక్సిం గ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అజరు సింగ్, క్రీడా శాఖ కార్యదర్శి రాధే శ్యామ్ ఝులా నియా, సారు డైరెక్టర్ సందీప్ పర్దాన్లు భారత్ హై పవర్ కమిటీలో ఉన్నారు.