Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఖాళీ స్టేడియంలోనే ఏథెన్స్ కార్యక్రమం
ఎథేన్స్ (గ్రీస్) : కరోనా వైరస్ ప్రభావం టోక్యో ఒలింపిక్స్పైనే కాదు టోక్యో ఒలింపిక్స్ జ్యోతి అందజేత కార్యక్రమానికి సైతం తగులుతోంది. ఒలింపిక్ క్రీడల సంప్రదాయం ప్రకారం 1896లో తొలిసారి ఒలింపిక్స్ జరిగిన స్టేడియంలో తర్వాతి ఒలింపిక్స్ ఆతిథ్య నగరానికి ఒలింపిక్ జ్యోతిని అందజేస్తారు. ది సెంట్రల్ ఏథెన్స్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి వేలాదిగా అభిమానులు తరలి వస్తారు. గ్రీస్లో కరోనా వైరస్ కేసులు 228కి చేరుకున్నాయి. దీంతో గ్రీస్ ఒలింపిక్ సంఘం ఒలింపిక్ జ్యోతి అందజేసే కార్యక్రమంపై ఆంక్షలు విధించింది. అంతకుముందు జరిగే ఒలింపిక్ జ్యోతి ర్యాలీని గణనీయంగా కుదించింది. వచ్చే వారంలో జరుగనున్న ఒలింపిక్ జ్యోతి అందజేత కార్యక్రమాన్ని ఖాళీ స్టేడియంలోనే నిర్వహిస్తున్నామని, అభిమానులకు ఎటువంటి అనుమతి లేదని గ్రీస్ ఒలింపిక్ సంఘం ఆదివారం వెల్లడించింది.