Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా వైరస్ నేపథ్యంలో నిర్ణయం
ముంబయి : కరోనా వైరస్ దెబ్బకు అత్యంత ప్రభావితం అవుతోన్న క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను వాయిదా వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ సహా దేశవాళీ అన్ని టోర్నీలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 విజృంభిస్తున్న తరుణంలో బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఉద్యోగులు ఎవరూ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని సోమవరం వెల్లడించింది. అన్ని టోర్నీలు వాయిదా పడిన నేపథ్యంలో ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయాన్ని మూసివేయనున్నారు. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని బీసీసీఐ సూచించింది. ' కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో వాంఖడే స్టేడియంలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయం మూసివేయనున్నాం. ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే సంస్థ పనులు నిర్వర్తించాలని సూచించాం' అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 15కు ఐపీఎల్ వాయిదా పడగా, ఇరానీ కప్, మహిళల చాలెంజర్స్ ట్రోఫీలు సైతం వాయిదా పడ్డాయి.