Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్ నిర్వహిస్తామని తేల్చి చెప్పాయి. మంగళవారం జరిగిన ఒలింపిక్ కమిటీ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తే లేదని నిర్ణయించాయి. ఒలింపిక్ కమిటీ పూర్తిస్థాయి కమిటీ సభ్యుల సమావేశంలో ఒలింపిక్స్కు ఇంకా నాలుగు నెలల సమయం ఉందనీ, ఈలోపు కరోనా నియంత్రణ కొలిక్కి వచ్చే అవకాశముందనీ, ఒలింపిక్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసేది లేదని తేల్చి చెప్పాయి. నేడు విడుదల చేసిన ఓ ప్రకటనలో అంతర్జాతీయ క్రీడా ఫెడరేషన్స్ కరోనాకు భయపడొద్దనీ, నిరభ్యంతరంగా క్వాలిఫై టోర్నీలు నిర్వహించుకోవచ్చని తెలిపాయి. జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్ జరుగుతాయనీ, సన్నాహక పోటీల్లో అథ్లెట్లు నిరభ్యంతరంగా పాల్గొనవచ్చని తెలిపాయి. కరోనా వైరస్ కారణంగా సోమవారంనాటికి 33 క్రీడాంశాలు వాయిదా పడ్డాయని ఐఓసీ గుర్తించింది. ఇప్పటివరకూ 53% అంటే 11 వేలమంది అథ్లెట్లు ఒలింపిక్స్కు అర్హత సాధించారని, మరో 43 శాతంమంది అర్హత టోర్నీల ద్వారా ఒలింపిక్స్కు చేరాల్సి ఉందని తెలిపింది.
ఒలింపిక్ బాడీలే షెడ్యూల్ ప్రకారం అర్హత టోర్నీలు ఆడించి ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉందని, ఒకవేళ కోవిడ్-19 కారణంగా టోర్నీలు వాయిదా వేస్తే మాత్రం ర్యాంకింగ్స్ ప్రకారం ఆథ్లెట్లను ఎంపిక చేస్తామనీ, లేకుంటే అథ్లెట్ల రికార్డులను పరిశీలించి నేరుగా ఒలింపిక్స్కు పంపిస్తామని తెలిపాయి. కరోనా వైరస్ కారణంగా 2020లో జరగాల్సిన యూరోపియన్ ఛాంపియన్షిప్ ఫుట్బాల్ టోర్నీని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.