Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్, ఫైనల్ మ్యాచ్లు రద్దు
కరాచీ: కరోనా ముప్పుతో పాకిస్థాన్ సూపర్లీగ్ను సెమీస్ దశలోనే వాయిదా వేశారు. ఆటగాళ్లు, బ్రాడ్కాస్టింగ్ ఉద్యోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాక్లో కరోనా కేసులు నమోదు కావడంతో కరాచీ కింగ్స్కు ఆడిన ఇంగ్లండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్ టోర్నీ మధ్యలోనే సహచరులతో కలిసి వెళ్లిపోయాడు. ఇంటికి చేరుకోగానే స్వీయ నిర్భందంలోకి వెళ్లి పరీక్షలు నిర్వహించగా.. అతనికి కరోనా వైరస్ సోకిందని సమాచారం. పరీక్షల్లోనూ పాజిటివ్ అని తేలింది. పాకిస్థాన్ మాజీ సారథి, క్రికెట్ వ్యాఖ్యాత రమీజ్ రాజా సైతం కొవిడ్-19 లక్షణాలతో బాధపడుతున్నాడని సమాచారం.
జపాన్ ఒలింపిక్స్ కమిటీ ఉపాధ్యక్షునికి కరోనా
జపాన్ ఒలింపిక్స్ కమిటీ ఉపాధ్యక్షుడు, జపాన్ ఫుట్బాల్ సమాఖ్య అధ్యక్షుడు కోజో తాషిమా(62)కు కరోనా వైరస్ సోకింది. మంగళవారం నిర్వహించిన పరీక్షలో నివేదికలో కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఈ ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై అనుమానాలు మరింత పెరిగాయి. ''ఈ రోజు నాకు నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్ అని తేలింది. నాకు కాస్త జ్వరంగా అనిపించింది. వైద్యులు కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పారు. అనంతరం ఫలితాల్లో పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా... చికిత్స తీసుకుంటున్నా'' అని తాషిమా తెలిపారు. ఫిబ్రవరి 28న నార్తర్న్ ఐర్లాండ్ రాజధాని బెల్ఫాస్ట్లో అంతర్జాతీయ ఫుట్బాల్ అసోషియేషన్ బోర్డు(ఐఎఫ్ఎబీ) సమావేశం, ఈ నెల 3న నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్లో జరిగిన యురోసియన్ సాకర్ సమాఖ్య(యూఈఎఫ్ఏ) వార్షిక సమావేశంలో పాల్గొన్నట్టు ఆయన పేర్కొన్నారు.