Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణంపై ఆంక్షలు
- బీసీసీఐ నిర్ణయం
న్యూఢిల్లీ : భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) దుబారా వ్యయాన్ని (కాస్ట్ కటింగ్) తగ్గించుకోవాలని నిర్ణయించింది. సౌరవ్ గంగూలీ అధ్యక్షతన ఉన్న ప్రపంచంలోనే సంపన్నమైన బీసీసీఐ ఇప్పుడు ఖర్చు తగ్గించుకునే పనిలో పడింది. ఐపీఎల్లో ఆయా టీములకిచ్చే ప్రైజ్మనీలో 50 శాతం మేర కోత పెట్టింది. ఇప్పుడు ఆ కత్తెరకు మరింత పదను పెట్టింది. విమాన ప్రయాణాల్లోనూ కొన్ని నియమని బంధనలు పాటించబోతున్నది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా.. దేశీయ విమాన ప్రయాణాల్లో బిజినెస్ క్లాస్ పర్యటనలకు బ్రేక్ వేసింది. కేవలం సీనియర్, జూనియర్ సెలెక్టర్లు మాత్రమే బిజినెస్ క్లాసుల్లో ప్రయాణించొచ్చు. చివరి కి బీసీసీఐ ముఖ్య కార్యనిర్వాహకుడు కూడా ఎకానమీ క్లాస్లోనే వెళ్లాల్సి ఉంటుంది. తాము తీసుకున్న కాస్ట్ కటింగ్ వల్ల భారీగా ఆదాయం మిగులుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడు తున్నారు. అయితే, ఏడు గంటలకు మించి ప్రయాణం ఉన్నట్టయితే బిజినెస్ క్లాస్లో వెళ్లొచ్చు.