Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరట్లో ఆట వస్తువుల విక్రయాలపై దెబ్బ
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్.. ఉత్తరాఖండ్లోని మీరట్ వ్యాపారాన్ని కూడా కకలావికలం చేసింది. ఇక్కడి స్పోర్ట్ ఇండిస్టీ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నది.
మీరట్: మీరట్లో తయారయ్యే బ్యాట్తోనే మైదానంలో ఆటగాళ్లు రెచ్చిపోతుంటారు. క్రికెట్ మైదానంలోకి దిగి పరుగుల ప్రవాహంతో అభిమానుల్ని ఆకట్టుకుంటారు. ఇక్కడి స్పోర్ట్ ఇండిస్టీ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటుంది. కానీ, కరోనా బౌన్సర్ దెబ్బకు ఇప్పుడు ఈ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆట వస్తువుల విక్రయాలు ఆగిపోయాయి. క్రీడా మైదానాలు బోసిపోతున్నాయి. కరోనా వైరస్తో స్పోర్ట్ ఇండిస్టీ అస్తవ్యస్తమైందని వ్యాపారి రాకేశ మహాజన్ తెలిపారు. మీరట్లో అన్ని రకాల క్రీడా వస్తువులు తయారవుతాయి. బ్యాట్, బాల్, ప్యాట్తో పాటు క్రికెట్తో ముడిపడి ఉన్న అన్ని వస్తువులూ తయారవుతాయి. కరోనా కాటుకు దేశీయ మార్కెట్ దెబ్బతిన్నదని రాకేశ్ తెలిపారు.
సాధారణంగా ఐపీఎల్ ప్రారంభం కాగానే.. యువకులు, పిల్లలు మైదానాల్లో ఆడటానికి రెడీ అవుతారు. దీంతో లోకల్ మార్కెట్లో క్రికెట్ సామాన్ల విక్రయాలు బాగా జరుగుతాయి. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ఐపీఎల్ నిర్వహణ ఆగిపోయినా.. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది నిర్ణయించలేదు. మరోవైపు పిల్లలు కూడా మైదానాలకు దూరంగా ఉంటున్నారు. అన్నిరకాల ఆటల్నీ నిషేధించారు. చిన్న చిన్న ఆటస్థలాలన్నీ మూసేశారు. దీంతో మీరట్ స్పోర్ట్స్ ఇండిస్టీ తయారు చేసిన వస్తువులన్నీ గోడౌన్లలో పేరుకుపోయాయి. ఇక్కడ తయారయ్యే క్రికెట్ వస్తువులు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలారడ్ సహా పలు దేశాలకు ఎగుమతి అయ్యేవి. 2020 ఐపీఎల్ కోసం తయారు చేసిన వస్తువులు కూడా ఫ్యాక్టరీల్లో మూలపడి ఉన్నాయి. కోట్లు విలువ చేసే ఈ పరికరాలన్నీ ఏం చేయాలో తెలియటం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క క్రికెట్ వస్తువులే కాదు హాకీ, టెన్నిస్, అథ్లెటిక్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, ఫుట్బాల్.. ఇలా ఎన్నో ఆట వస్తువులు తయారు చేసే మీరట్ మార్కెట్పై మాంద్యం.. కరోనా ప్రభావంతో వ్యాపారాలు నిలిచిపోయాయి. అప్పో సప్పో చేసి తయారు చేసిన ఈ వస్తువులు ఎప్పుడు అమ్ముడవుతాయోనన్న ఆందోళన వ్యాపారుల్లో కనిపిస్తున్నది.