Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఫామ్లో లేకపోవటం..కరోనా వైరస్ జోరు
-ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నిరీక్షణ..
ముంబయి: విరాట్ కోహ్లి...ఈ పేరు వింటేనే పరుగుల వర్షం కండ్ల ముందు కదులుతుంది. మైదానంలో దిగితే చాలు..బౌండరీలు..సిక్సర్ల మోతతో అభిమానుల్ని ఆకట్టుకుంటారు. గత ఆరేండ్లుగా అది ఏ క్యాలర్ ఇయర్ అయినా మూడో ఇన్నింగ్..అంతర్జాతీయ క్రికెట్లో శతకాన్ని బాదేసేవాడు. కానీ 2020 లో విరాట్ ఫామ్లో లేకపోవటం..కరోనా వైరస్ కారణంగా కెప్టెన్ కు నిరీక్షణ తప్పేటట్టు లేదన్న సంకేతాలొస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు బాదిన రికార్డు ఉన్నా..మరో శతకాన్ని బాది 71 వ సెంచరీ చేద్దామనుకుంటుంటే..ప్రస్తుత పరిస్థితుల్లో మరి కొన్నాళ్లు ఓపికపట్టక తప్పని పరిస్థితులు వెంటాడుతున్నాయి.
ఈ ఏడాది జరిగిన టెస్టులు, వన్డేలు...టీ..20 మ్యాచ్లు కలిపి కోహ్లి 16 ఇన్నింగులు ఆడాడు. ఇందులో అత్యధిక స్కోరు 89. ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా బెంగళూరులో భారత్ ఆడిన వన్డే మ్యాచ్లో ఆ పరుగులు సాధించాడు. 2010 తర్వాత కోహ్లి కేరియర్లో మొదటిసారి ఏడాదిలో తొలి రెండు నెలలు అంతర్జాతీయ క్రికెట్లో శతకాలకు దూరంగా ఉన్నాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక శతకాలు
ఆటగాడు (దేశం) సెంచరీలు
సచిన్ టెండూల్కర్(భారత్) 100
రికి పాంటింగ్ (ఆస్ట్రేలియా) 71
విరాట్ కోహ్లి (భారత్) 70
కుమార సంగక్కర (శ్రీలంక) 63
జాక్ కలిస్ (దక్షిణాఫ్రికా) 62
2020లో ఇప్పటి వరకు కోహ్లి భారతగడ్డపై శ్రీలంకకు వ్యతిరేకంగా ఆడిన మూడు టీ..20 మ్యాచులు, ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా మూడు వన్డే మ్యాచులు ఆడాడు. న్యూజిలాండ్ పర్యటనలో నాలుగు టీ..20, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచులు ఆడాడు. మొత్తం 16 ఇన్నింగుల్లో కోహ్లి 30.46 యావరేజీతో 457 పరుగులు చేశాడు.
ఐపీఎల్ కన్నా ముందు నో ఛాన్స్..
ఐపీఎల్ కన్నా ముందుగా దక్షిణాఫ్రికాతో భారత్ ఆడాల్సి ఉన్నది. ఈ మ్యాచుల్లో విరాట్ తన ఫార్మ్ను తిరిగి చూపించడానికి ప్రాక్టీసు బాగా చేశాడు. కానీ ధర్మశాలలో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. మిగతా రెండు మ్యాచులు కరోనా(కొవిడ్..19) దెబ్బకు టూర్ రద్దయింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా దెబ్బకు క్రీడాపోటీలన్నీ నిలిచిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికి పాటింగ్ కు సమంగా చేరాలనుకున్నా కోహ్లికి నిరీక్షణ తప్పదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.