Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కరోనా వైరస్కు బెదరని హాకీ జట్లు
-బెంగళూర్లో జోరుగా ప్రాక్టీస్
-టోక్యో ఒలింపిక్స్ కోసం కఠోర సాధన
నవతెలంగాణ-బెంగళూర్
కరోనా వైరస్ దెబ్బకు స్టేడియాలు ఖాళీ అయ్యాయి. మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ ఆటగాళ్లు అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. కరోనా మహమ్మారి తాకిడికి అమెరికాలో ఎన్బిఎ నుంచి భారత్లో ఐపీఎల్ వరకూ అన్నీ ఆగిపోయాయి. భారత్లో ఏప్రిల్ 5 వరకు ఎటువంటి క్రీడా పోటీలు నిర్వహించడానికి వీల్లేదని క్రీడా మంత్రిత్వ శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఆదేశాలు జారీ చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్, ఐపీఎల్ సహా దేశవాళీ టోర్నీలు వాయిదా వేసింది. బ్యాడ్మింటన్ టోర్నీలు వాయిదా పడ్డాయి. బెంగళూర్లో జరగాల్సిన బాస్కెట్బాల్ ఒలింపిక్స్ ఈవెంట్ వాయిదా పడింది. మ్యాచులు వాయిదా, రద్దు కావటంతో ఆటగాళ్లు ఇండ్లకే పరిమితం అయ్యారు. ఐపీఎల్ వాయిదా పడటంతో ఎనిమిది ప్రాంఛైజీలు ఆటగాళ్ల శిక్షణ శిబిరాలను సైతం రద్దు చేశాయి. అసలు షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ జరుగుతాయా? రద్దు అవుతాయా? వాయిదా పడుతుందా? అనే సందిగ్ధంలో టోక్యో ఒలింపిక్స్ కొట్టుమిట్టాడుతోంది. ఇటువంటి అనిశ్చితి, విపత్కర పరిస్థితుల్లో భారత హాకీ జట్లు మాత్రం కఠోర సాధనలో మునిగిపోయాయి. బెంగళూర్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సారు) కేంద్రంలో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు ప్రాక్టీస్ సెషన్లో నిమగమయ్యాయి. టోక్యో ఒలింపిక్స్ లక్ష్యంగా చెమటోడ్చుతున్నాయి.
పటిష్ట భద్రత నడుమ.. : టోక్యో ఒలింపిక్స్కు భారత మెన్స్, మహిళల జట్లు అర్హత సాధించాయి. మహిళల జట్టు తొలిసారి వరుసగా రెండోసారి ఒలింపిక్స్లో ఆడేందుకు రంగం సిద్ధం చేసుకుంది. పురుషుల జట్టు తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో ఆడాల్సి ఉండగా, మహిళల జట్టు నెదర్లాండ్స్ను ఢకొీట్టాల్సి ఉంది. జులైలో జరిగే విశ్వ క్రీడా సంగ్రామాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అందుకే కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ, భారత హాకీ జట్లు బెంగళూర్లో సాధన చేస్తున్నాయి. సారు కేంద్రంలో శిక్షణ శిబిరంలో ఉన్న హాకీ ఆటగాళ్లందరికీ నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. శరీర ఉష్ణోగ్రతలు క్రమం తప్పకుండా పరీక్షిస్తున్నారు. సారు కేంద్రంలోకి కొత్త వ్యక్తులను ఎవరినీ అనుమతించటం లేదు. బయటి వ్యక్తులకు ప్రవేశం కల్పించకుండా, కరోనా వైరస్ నివారణకు ముందు జాగ్రత్త చర్యలు అన్నింటిని తీసుకుంటున్నారు. ఆటగాళ్లకు భోజన, వసతి ఏర్పాట్లు చూస్తున్న సిబ్బందిని సైతం నిరంతరం పరీక్షిస్తున్నారు. ఒలింపిక్స్లో స్వర్ణాల స్వర్ణయుగం చూసిన హాకీ ఇండియా...ఇటీవల కాలంలో కనీసం కాంస్యానికి కూడా నోచుకోవటం లేదు. దీంతో టోక్యో ఒలింపిక్స్ నుంచైనా పతకంతో తిరిగి రావాలనే బలమైన సంకల్పంతో హాకీ ఇండియా జట్లు బెంగళూర్ సారు కేంద్రంలో కఠోర సాధన చేస్తున్నాయి.
' కోవిడ్-19 ప్రభావం మా ప్రాక్టీస్ సెషన్లపై లేదు. శిక్షణ శిబిరంలోని ఆటగాళ్లు అందరూ క్రమం తప్పకుండా చేతులు కడుక్కుంటున్నారు. వైద్యులు శరీర ఉష్ణోగ్రతలు పరీక్షిస్తున్నారు. సురక్షిత వాతావరణంలో ట్రైనింగ్ సెషన్ జరిగేందుకు సారు కేంద్రం అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. సారు అధికారులు, కోచ్ల మద్దతుతో భారత హాకీ జట్టు ఒలింపిక్ సన్నద్ధత గొప్పగా సాగుతోంది' అని భారత మెన్స్ హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ అన్నాడు.
' అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సారు క్యాంపస్ ఇక్కడ ఉండటం మా అదృష్టం. ఇక్కడ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడుతున్నారు. అందుకే మా ఒలింపిక్స్ ప్రాక్టీస్ సెషన్లు సజావుగా సాగుతున్నాయి. క్రీడాకారిణీల ఆరోగ్య పరిస్థితిని రోజువారీ పర్యవేక్షిస్తున్నారు. కరోనా వైరస్ నివారణకు ప్లేయర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టోక్యో ఒలింపిక్స్పై మా ఫోకస్ ఉండేందుకు సారు అధికారులు ఎంతో మద్దతుగా నిలుస్తున్నారు' అని మహిళల జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ వ్యాఖ్యానించింది.