Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి విశృంఖలంగా విహారం చేస్తున్న ప్రమాదకర పరిస్థితుల్లో భారత క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదకర మహమ్మారి కారణంగా బాధపడుతున్న రోగులకు క్వారంటైన్ కేంద్రాలుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సారు) సెంటర్లు పని చేయనున్నాయని క్రీడా శాఖ ఆదివారం పేర్కొన్నది. సారు శిక్షణ కేంద్రాలు, హాస్టళ్లు, ఇతర సౌకర్యాలను క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చారు. ' అవును, సారు సెంటర్లను కోవిడ్-19 క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగించుకునేందుకు క్రీడా శాఖ అంగీకరించింది. ఆర్యోగ శాఖ చేసిన వినతితో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది మహమ్మారి ప్రబలుతున్న సమయం. అన్ని సారు కేంద్రాలు ప్రజల ఆస్తులే. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎటువంటి సహకారమైనా చేసేందుకు సారు సెంటర్లు సిద్ధంగా ఉన్నాయి' అని క్రీడా శాఖ కార్యదర్శి జులానియా ప్రకటనలో తెలిపారు.