Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-క్రీడా రంగంలో భారతీయుల మనోగతం
-బీబీసీ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
న్యూఢిల్లీ: భారత మెన్స్ క్రికెట్ జట్టు తరఫున ఒకే మ్యాచ్లో జయంత్ యాదవ్ కేంద్ర కాంట్రాక్టులో రూ. కోటి వేతనం అందుకుంటున్నాడు. భారత మహిళల క్రికెట్ జట్టుకు అత్యధిక మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహించిన దిగ్గజం మిథాలీరాజ్ వార్షికంగా రూ. 50 లక్షలు మాత్రమే అందుకుంటోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో వేతనంపై లింగ భేదంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. మహిళల క్రికెట్పై ఆదాయం రావటం లేదని, వారికి ఇచ్చే వేతనాలు సైతం మెన్స్ క్రికెట్ ఆదాయం నుంచి లభిస్తున్నవే అని బీసీసీఐ అధికారులు అనధికారంగా వెల్లడించారు. ఒక్క క్రికెట్లోనే కాదు అన్ని క్రీడల్లోనూ వేతనంలో లింగ వివక్ష భారత్లో కొనసాగుతోంది. ఇదే అంశంపై బ్రిటన్ మీడియా సంస్థ బీబీసీ భారత్లో ఇటీవల సర్వే చేసింది. 14 రాష్ట్రాల్లో 10181 అభిప్రాయాలను తీసుకుంది. అత్యధికులు మహిళా అథ్లెట్లు పురుష అథ్లెట్లతో సమానంగా వేతనాలు అందుకోవాలని ఆకాంక్షించినట్టు బీబీసీ వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 36 శాతం మంది క్రీడలు జీవనశైలిలో ప్రధానమని చెప్పా రు. సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం పురుషులు క్రీడలు ఆడుతున్నామని చెప్పగా, మహిళలు కేవలం 29 శాతం మాత్రమే క్రీడల్లో క్రీయాశీలంగా ఉన్నారు.