Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఐపీఎల్ నిర్వహణపై రోహిత్ శర్మ
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ ఎప్పుడు మొదలు అవుతుందా అని అభిమానులతో పాటు క్రికెటర్లు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ముందు జాగ్రత్తల్లో భాగంగా ఐపీఎల్ 13ను మార్చి 29 నుంచి ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. ప్రస్తుతం భారత్లో 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14న లాక్డౌన్ గడువు ముగుస్తుంది. అప్పటిలోగా పరిస్థితి కట్టడి చేయబడితే ఐపీఎల్ నిర్వహణ మే మొదటి వారంలోనైనా సాధ్యపడుతుంది. అయినా, లీగ్ నిర్వహణపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సైతం ఏమీ చెప్పలేనని వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిట్ పీటర్సన్ ఐపీఎల్ 13 నిర్వహణ విషయంపై ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మతో సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిపాడు. ఈ ఏడాది ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా? అసలు ఈ ఏడాదిలో ఐపీఎల్ ఉంటుందా? అని ఇన్స్టాగ్రామ్లో రోహిత్ను అడిగాడు. ' ఏదేని ఓ దశలో పరిస్థితులు చక్కబడితే, అప్పుడు జరిగే అవకాశం ఉంది. ఎవరికి తెలుసు' అని రోహిత్ శర్మ బదులిచ్చాడు.