Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మహిళల ఐపీఎల్పై మిథాలీరాజ్
న్యూఢిల్లీ : మహిళల ఐపీఎల్పై బీసీసీఐ ఎప్పటికీ వేచి చూసే ధోరణిలోనే ఉండిపోకూడదని, వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయి ఐపీఎల్ను ఆరంభించటం మంచిదని భారత వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది. టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్న మిథాలీరాజ్ 2021 వన్డే వరల్డ్కప్లో భారత జట్టుకు నాయకత్వం వహించనుంది!. ఇటీవల 2020 టీ20 వరల్డ్కప్ ఫైనల్స్కు చేరిన టీమ్ ఇండియా పొట్టి ఫార్మాట్లో కొత్త చరిత్ర సృష్టించింది. ' వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్ ఆరంభం కావాలని నేను వ్యక్తిగతంగా బలంగా కోరుతున్నాను. చిన్న స్థాయిలోనైనా సరే, నిబంధనల్లో కొంత మార్పులు చేసైనా సరే ఐపీఎల్ను ఆరంభించాలి. భారత దేశవాళీ సర్క్యూట్లో మహిళా క్రికెటర్ల కొరత ఉన్న మాట వాస్తవం. తొలుత ఆరుగురు విదేశీ క్రికెటర్లకు అవకాశం కల్పించి, ఆ తర్వాత మన క్రికెటర్లు సిద్ధమయ్యాక నలుగురుకి కుదించవచ్చు. ప్రస్తుత ప్రాంఛైజీల మహిళల జట్ల కోసం నడుం బిగిస్తే ఇది సాధ్యపడుతుంది. నాలుగు జట్లతో లీగ్కు బీసీసీఐ సిద్ధంగా ఉంది. మహిళల ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ ఎప్పటికీ ఎదురుచూస్తూనే ఉండిపోకూడదు. ఎప్పుడో ఓసారి ఇది మొదలు కావాల్సిందే. లీగ్ జరుగుతున్న కొద్దీ మెరుగవుతుంది' అని మిథాలీ రాజ్ పేర్కొంది. 2019 ఐపీఎల్ సమయంలో బీసీసీఐ మూడు జట్లతో ఎగ్జిబిషన్ మ్యాచులు నిర్వహించింది. వెలాసిటీ, ట్రయల్బ్లేజర్స్, సూపర్నోవాస్ జట్లతో మహిళల మినీ ఐపీఎల్కు నాంది పడింది. ఈ ఏడాది బీసీసీఐ నాలుగు జట్లతో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ సమయంలో ఎగ్జిబిషన్ మ్యాచులకు ప్రణాళిక రచించింది. కరోనా వైరస్తో ఐపీఎల్13కు బ్రేక్ పడగా, మహిళల మినీ ఐపీఎల్ సైతం వాయిదా పడింది.