Authorization
Mon Jan 19, 2015 06:51 pm
* లాక్డౌన్పై ట్విటర్లో విరాట్ కోహ్లి
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కారణంగా ఐసీసీ ఈవెంట్లు వాయిదా పడ్డాయి. బీసీసీఐ టోర్నీలు వాయిదా వేసింది. ఐపీఎల్13 నిర్వహణ అనుమానంగా మారింది. కరోనా వైరస్ మహమ్మారి, 21 రోజుల లాక్డౌన్ పరిస్థితుల్లో క్రీడాకారులు ఇండ్లకే పరిమితం అయ్యారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలు, అభిమానుల్లో అవగాహన తీసుకొచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పదేండ్లుగా తీరిక లేని క్రికెట్తో గడిపిన విరాట్ కోహ్లి ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఇంట్లో భార్య అనుష్క శర్మతో కలిసి ఉంటున్నాడు. విరామ సమయంలో ఫిట్నెస్పై దృష్టి సారించిన విరాట్ కోహ్లి, లాక్డౌన్పై అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు. కష్టకాలంలో దేశానికి అందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చాడు. ' వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా మేల్కోనండి. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా మెలగండి. కోవిడ్-19పై చేస్తున్న యుద్ధం సాధారణ యుద్ధం కాదు. లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రజలు వీధుల్లోకి రావటం పట్ల సంతృప్తిగా లేను. ప్రభుత్వ ఆదేశాలను విధిగా పాటించండి. ఇది దేశానికి మద్దతుగా నిలవాల్సిన సమయం' అని ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను కోహ్లి ట్వీట్ చేశాడు.